వ్యాపార, వాణిజ్య రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచినవారికి విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అవార్డులను ప్రదానం చేయనుంది. జూన్ 12న విశాఖలోని తాజ్ హోటల్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని వీసీసీఐ సభ్యులు తెలిపారు. వీసీసీఐ ఎక్స్ లెన్స్ అవార్డులుగా ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీపుడ్, ఫార్మా, లాజిస్టిక్ రంగాల్లో నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఐదు వ్యాపార రంగాల్లో 14 కేటగిరిల్లో అవార్డులు ఇస్తామనీ... వివిధ కేటగిరీల పరిధిలో వచ్చిన దరఖాస్తులను ఐదుగురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం పరిశీలించి.. విజేతలను ఎంపిక చేస్తుందని తెలియజేశారు. జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఇవి చదవండి....ముస్లిం ఉద్యోగులు గంట ముందే వెళ్లిపోవచ్చు!