ETV Bharat / state

వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది..ఆదుకోండి: విశాఖ లారీ ఓనర్ల సంఘం

author img

By

Published : Aug 10, 2021, 7:03 PM IST

కరోనా కారణంగా వ్యాపారం తీవ్రంగా దెబ్బతిందని లారీ రవాణా విభాగం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

విశాఖ లారీ ఓనర్ల సంఘం
విశాఖ లారీ ఓనర్ల సంఘం

కరోనాతో కుదేలైన లారీ ట్రాన్స్​ పోర్ట్ విభాగంపై ప్రభుత్వం కనికరం చూపించాలని విశాఖ లారీ ఓనర్ల సంఘం వేడుకుంది. వీజేఎఫ్ క్లబ్​లో జరిగిన సమావేశంలో మీడియాతో లారీ రవాణా విభాగం ప్రతినిధులు మాట్లాడారు.

కరోనా సమయం నుంచి లారీ రవాణా వ్యాపారం బాగోలేదని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాయితీ కానీ.. వెసులుబాటు కానీ ఇవ్వలేదని అన్నారు. దానికితోడు పెరిగిన డీజిల్ ధరలు ఊపిరి సలపనివ్వడం లేదని వాపోయారు. బలవంతంగా ఆశీలు(Tax) వసూలు చేయడం తగదని అంటున్నారు.

సీఎం, మంత్రులను కలిసినా న్యాయం జరగలేదని.. కనీసం ఇప్పుడైనా న్యాయం చేయాలని వేడుకున్నారు.


ఇదీ చదవండి: దారి తప్పారు.. సరుకు వదిలేశారు..!

కరోనాతో కుదేలైన లారీ ట్రాన్స్​ పోర్ట్ విభాగంపై ప్రభుత్వం కనికరం చూపించాలని విశాఖ లారీ ఓనర్ల సంఘం వేడుకుంది. వీజేఎఫ్ క్లబ్​లో జరిగిన సమావేశంలో మీడియాతో లారీ రవాణా విభాగం ప్రతినిధులు మాట్లాడారు.

కరోనా సమయం నుంచి లారీ రవాణా వ్యాపారం బాగోలేదని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాయితీ కానీ.. వెసులుబాటు కానీ ఇవ్వలేదని అన్నారు. దానికితోడు పెరిగిన డీజిల్ ధరలు ఊపిరి సలపనివ్వడం లేదని వాపోయారు. బలవంతంగా ఆశీలు(Tax) వసూలు చేయడం తగదని అంటున్నారు.

సీఎం, మంత్రులను కలిసినా న్యాయం జరగలేదని.. కనీసం ఇప్పుడైనా న్యాయం చేయాలని వేడుకున్నారు.


ఇదీ చదవండి: దారి తప్పారు.. సరుకు వదిలేశారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.