ETV Bharat / state

విశాఖలో హైటెన్షన్​.. వైకాపా నేతల కార్లపై దుండగుల రాళ్ల దాడి

author img

By

Published : Oct 15, 2022, 5:33 PM IST

Updated : Oct 15, 2022, 7:19 PM IST

TENSION AT VIZAG AIRPORT : విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులు రోజా, జోగిరమేశ్‌తోపాటు వైకాపా నేత Y.V. సుబ్బారెడ్డి కార్లపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అదే సమయంలో విశాఖ వస్తున్న పవన్‌కు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున జనసేన శ్రేణులు తరలిరావడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రుల కార్లపై దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

TENSION AT VIZAG AIRPORT
TENSION AT VIZAG AIRPORT

TENSION AT VISAKHA AIRPORT : విశాఖ విమానాశ్రయం వద్ద కొద్దిసేపు అలజడి చోటుచేసుకుంది. విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన జనసమూహం మంత్రుల కార్లపై దాడికి దిగింది. మంత్రులు రోజా, జోగి రమేశ్‌ వాహనాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆ వెనకే వస్తున్న వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కారుపైనా దాడి చేశారు. ఈ ఊహించని దాడితో మంత్రులు కొంత కంగారుపడ్డారు.

విశాఖలో హైటెన్షన్​.. వైకాపా నేతల కార్లపై దుండగుల రాళ్ల దాడి

మంత్రులపై ఆగ్రహించిన జనసైనికులు : విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు వైకాపా నేతలు విమానాశ్రయానికి చేరుకోగా.. అప్పుడే విశాఖ వస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో జనసేన శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. విశాఖ గర్జనలో పవన్‌కల్యాణ్‌ లక్ష్యంగా మంత్రులు విమర్శలు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జనసేన కార్యకర్తలు.. మంత్రులు, అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడ ఉన్న గుంపులో నుంచి కొందరు వ్యక్తులు వైకాపా నేతల కార్లవైపు దూసుకొచ్చారు. మంత్రుల కార్ల బ్యానెట్లపై చేతులతో బాదారు.

ఘటనపై స్పందించిన వైకాపా మంత్రులు : తమపై దాడికి పాల్పడింది జనసేన కార్యకర్తలేనని వైకాపా నేతలు ఆరోపించారు. వారి దాడిలో కారు డ్రైవర్ గాయపడినట్లు తెలిపారు. పోలీసులు గుంపులుగా చేరిన వారిని చెదరగొట్టారు. రాళ్లదాడి ఘటనంపై విచారణ చేపట్టిన పోలీసులు.. విమానాశ్రయంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. విమానాశ్రయ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జోగి రమేశ్ , సుబ్బారెడ్డిపై జనసైనికులు దాడి చేశారన్నారు. దీనికి పవన్ జవాబు చెప్పాలని అంబటి ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.

  • వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై
    విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!

    — Ambati Rambabu (@AmbatiRambabu) October 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొత్త నాటకానికి తెరలేపిన వైకాపా : పవన్ పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే వైకాపా కొత్త నాటకానికి తెరలేపిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దాడి సంస్కృతిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదని వెల్లడించారు. దాడి చేసింది జనసేన కార్యకర్తలని పోలీసులు కూడా నిర్థరించలేదన్నారు. పవన్ పర్యటనకు బందోబస్తు కల్పించాలని డీజీపీకి లేఖ రాసినా.. నామమాత్రంగానే బందోబస్తు ఏర్పాటు చేశారని విమర్శించారు.

ఇవీ చదవండి:

TENSION AT VISAKHA AIRPORT : విశాఖ విమానాశ్రయం వద్ద కొద్దిసేపు అలజడి చోటుచేసుకుంది. విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్తున్న మంత్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన జనసమూహం మంత్రుల కార్లపై దాడికి దిగింది. మంత్రులు రోజా, జోగి రమేశ్‌ వాహనాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆ వెనకే వస్తున్న వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కారుపైనా దాడి చేశారు. ఈ ఊహించని దాడితో మంత్రులు కొంత కంగారుపడ్డారు.

విశాఖలో హైటెన్షన్​.. వైకాపా నేతల కార్లపై దుండగుల రాళ్ల దాడి

మంత్రులపై ఆగ్రహించిన జనసైనికులు : విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు వైకాపా నేతలు విమానాశ్రయానికి చేరుకోగా.. అప్పుడే విశాఖ వస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో జనసేన శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. విశాఖ గర్జనలో పవన్‌కల్యాణ్‌ లక్ష్యంగా మంత్రులు విమర్శలు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జనసేన కార్యకర్తలు.. మంత్రులు, అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడ ఉన్న గుంపులో నుంచి కొందరు వ్యక్తులు వైకాపా నేతల కార్లవైపు దూసుకొచ్చారు. మంత్రుల కార్ల బ్యానెట్లపై చేతులతో బాదారు.

ఘటనపై స్పందించిన వైకాపా మంత్రులు : తమపై దాడికి పాల్పడింది జనసేన కార్యకర్తలేనని వైకాపా నేతలు ఆరోపించారు. వారి దాడిలో కారు డ్రైవర్ గాయపడినట్లు తెలిపారు. పోలీసులు గుంపులుగా చేరిన వారిని చెదరగొట్టారు. రాళ్లదాడి ఘటనంపై విచారణ చేపట్టిన పోలీసులు.. విమానాశ్రయంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. విమానాశ్రయ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. జోగి రమేశ్ , సుబ్బారెడ్డిపై జనసైనికులు దాడి చేశారన్నారు. దీనికి పవన్ జవాబు చెప్పాలని అంబటి ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.

  • వై వి సుబ్బారెడ్డి,జోగి రమేష్ లపై
    విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి!

    — Ambati Rambabu (@AmbatiRambabu) October 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొత్త నాటకానికి తెరలేపిన వైకాపా : పవన్ పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే వైకాపా కొత్త నాటకానికి తెరలేపిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దాడి సంస్కృతిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదని వెల్లడించారు. దాడి చేసింది జనసేన కార్యకర్తలని పోలీసులు కూడా నిర్థరించలేదన్నారు. పవన్ పర్యటనకు బందోబస్తు కల్పించాలని డీజీపీకి లేఖ రాసినా.. నామమాత్రంగానే బందోబస్తు ఏర్పాటు చేశారని విమర్శించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 15, 2022, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.