ETV Bharat / state

'ద్రవ్య వినిమయ బిల్లును తెదేపా అడ్డుకోలేదు'

author img

By

Published : Jun 18, 2020, 9:41 PM IST

మండలిలో మనీ బిల్లును తెదేపా అడ్డుకోలేదని.. దీనిపై వైకాపా మంత్రులు దుష్ర్పచారం చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు అన్నారు. శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల తీరు చాలా దారుణంగా ఉందని విమర్శించారు.

tdp mlc budda naga jagadeswara rao fires on ycp ministers
బుద్దా నాగ జగదీశ్వరరావు, తెదేపా ఎమ్మెల్సీ

శాసనమండలిలో వైకాపా మంత్రులు దౌర్జన్యంగా ప్రవర్తించారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. విశాఖలో మాట్లాడుతూ.. మండలిలో తీవ్ర పరిణామాలు జరిగాయన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును తెదేపా ఆపేసిందంటూ వైకాపా సభ్యులు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.

మనీ బిల్లు పాస్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రయత్నించిందని.. అధికార పక్షం అందుకు సహకరించలేదని తెలిపారు. మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్​లు దారుణంగా మాట్లాడరని చెప్పారు. అనిల్ తనపై దాడికి ప్రయత్నించారని వెల్లడించారు.

శాసనమండలిలో వైకాపా మంత్రులు దౌర్జన్యంగా ప్రవర్తించారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు విమర్శించారు. విశాఖలో మాట్లాడుతూ.. మండలిలో తీవ్ర పరిణామాలు జరిగాయన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును తెదేపా ఆపేసిందంటూ వైకాపా సభ్యులు దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.

మనీ బిల్లు పాస్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రయత్నించిందని.. అధికార పక్షం అందుకు సహకరించలేదని తెలిపారు. మంత్రులు అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్​లు దారుణంగా మాట్లాడరని చెప్పారు. అనిల్ తనపై దాడికి ప్రయత్నించారని వెల్లడించారు.

ఇవీ చదవండి...

మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి: కాల్వ శ్రీనివాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.