ఈనెల 4వ తేదీన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు అభిమానులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించవద్దని తెలిపారు.
అభిమానులు ఎవరూ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ రావద్దని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా పుట్టినరోజు నాడు నిర్వహించే రక్తదాన శిబిరాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్టు అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
ఇదీ చదవండి: పురోగతి లేని భారత్-చైనా అధికారుల చర్చలు