విశాఖ జిల్లా పాయకరావుపేట వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డు ఆవరణలో ఏఎంసీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీను ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యార్డు ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి.. కార్యకలాపాలకు ఇబ్బందికరంగా ఉండేది. సమస్యపై స్పందించిన పాలకవర్గం చెత్త, వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డును తీర్చిదిద్దుతామని పాలకవర్గం సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి. ప్రత్యేక అధికారుల పాలన గడువు పెంపు