విశాఖ మన్యం పాడేరులో వివిధ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉపకారవేతనం కోసం రోడ్డెక్కారు. విద్యాసంవత్సరం ముగుస్తున్నా.. ఇప్పటివరకూ డబ్బు మంజూరుచేయలేదన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటి ఎదుట బైఠాయించారు. ఆమె స్పందించి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్ష ఫీజు చెల్లించలేదని హాల్టికెట్లు ఇవ్వడంలేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రిన్సిపల్తో తాను మాట్లాడతానని.. అందరూ పరీక్ష రాసేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి.. ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి