విశాఖ జిల్లా చోడవరంలో అండర్ - 19 బాల బాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ బోర్డ్ ప్రాంతీయాధికారి నగేష్ వీటిని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 368 మంది క్రీడాకారులు తరలివచ్చారు. నగేష్ మాట్లాడుతూ.. కబడ్డీ ఆట కలిసికట్టుతనాన్ని నేర్పుతుందన్నారు. ఈ నెల 31 వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. రీజనల్ ఇన్స్పెక్టర్ బి. సుజాత తదితరులు హాజరయ్యారు.
ఇవీ చదవండి