మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విశాఖ జిల్లా సీలేరు ఎస్ఐ రంజిత్.. యువతకు సూచించారు. జీకే వీధి మండలం దారకొండ సంతలో గిరిజన యువతతో ఆయన మాట్లాడారు. చెడు వ్యసనాలతో జీవితాలు ప్రమాదంలో పడతాయన్నారు.
నాటు సారా, గంజాయికి దూరంగా ఉండాలని చెప్పారు. రేషన్, ఆధార్ కార్డులు లేనివారు గ్రామ వాలంటీర్లను సంప్రదించాలన్నారు. గిరిజన గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు.
ఇదీ చదవండి: