ETV Bharat / state

అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

author img

By

Published : Feb 12, 2021, 9:48 PM IST

Updated : Feb 13, 2021, 9:08 AM IST

విశాఖ జిల్లా అరకులోయ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో కూడిన బస్సు 80 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లి పడిపోవడంతో చిన్నారి సహా నలుగురు చనిపోయారు. మృతులు, క్షతగాత్రులు అందరూ హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతానికి చెందినవారు. తీర్థయాత్రలు ముగించుకుని అరకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

విహారం మిగిల్చిన విషాదం
విహారం మిగిల్చిన విషాదం

విహారయాత్ర ఆ నాలుగు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖ జిల్లా అరకులోయ నుంచి కిందికి వస్తున్న ఓ టూరిస్టు బస్సు లోయలోకి దూసుకెళ్లి చిన్నారి సహా నలుగురు చనిపోయారు. మృతులు, క్షతగాత్రులంతా నాలుగు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు. హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన కె.సత్యనారాయణ రిజర్వు బ్యాంకులో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రల కోసం ఈనెల 10న దినేష్‌ ట్రావెల్స్‌ మినీ బస్సులో హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు.

అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం రాత్రి సింహాచలం వసతిగృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం అరకు వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో సరదాగా గడిపారు. బొర్రా గుహలను సందర్శించి తిరుగు ప్రయాణంలో రాత్రి ఏడింటికి బొర్రా, టైడాకు మధ్యన మలుపు వద్ద బస్సు లోయలో పడింది. సుమారు 80 అడుగుల లోతులో పడిపోవడంతో చిన్నారి శ్రీనిత్య (8నెలలు), కొట్టం సత్యనారాయణ (62), కె.సరిత (40), ఎన్‌.లత (40) ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఎస్‌.కోట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి అందరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

ప్రమాద వివరాల కోసం విశాఖ కలెక్టరేట్‌లో 0891 2590102, 0891 2590100 కంట్రోల్‌రూం నంబర్లను ఏర్పాటుచేశారు. అరకులోయ నుంచి తిరిగి వస్తున్నప్పుడే బస్సు బ్రేకులు ఫెయిలైనట్లు డ్రైవర్‌ శ్రీశైలం గుర్తించాడు. బస్సులోని వారికి తెలపడంతో వారు కేకలు వేశారు. అప్పటికే ఘాట్‌ రోడ్డు దిగువకు వస్తుండడంతో బస్సును నియంత్రించడం కష్టమైంది. అయిదో నంబర్‌ మలుపు వచ్చేసరికి నియంత్రణ సాధ్యంకాక నేరుగా లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన అరగంట తరువాత షాక్‌లోంచి తేరుకుని చూస్తే తాను చెట్టు కొమ్మకు వేలాడుతున్నానని, బస్సులోని వారంతా చెల్లాచెదురై ఉన్నారని క్షతగాత్రుడు నరేష్‌కుమార్‌ చెబుతున్నారు. వీరి బ్యాగులు, సామగ్రి అంతా సింహాచలంలోనే ఉంది. శుక్రవారం రాత్రి సింహాచలం చేరుకుని శనివారం స్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్లిపోవాలనుకున్నారు. ఇంతలో ఘోరం జరిగింది.

మా పాప ఎక్కడ?
తీవ్రంగా గాయపడిన మౌనికకు తన 8నెలల కుమార్తె శ్రీనిత్య చనిపోయిన విషయం తెలియదు. ఎస్‌.కోట ఆసుపత్రిలో చికిత్స పొంది స్పృహలోకి వచ్చాక ‘అందరూ కనిపిస్తున్నారు.. నా కూతురు ఎక్కడుందో చెప్పండ’ని కుటుంబీకులను అడగడం చూపరులను కలచివేసింది.

మృతులంతా హైదరాబాద్‌ వాసులే...

ఆధ్యాత్మిక, విహారయాత్ర నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బయలుదేరే ముందు అందరూ ఫొటోలు దిగుతూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. రోజుల వ్యవధిలోనే బస్సు ప్రమాదానికి గురికావడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమాచారం పూర్తిగా తెలియక నగరంలోని బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. రిజర్వ్‌బ్యాంకు అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన కొట్టం సత్యనారాయణ షేక్‌పేటలో నివసిస్తున్నారు. ఆయనకు వరసయ్యే సోదరులు నరసింహారావు, పాండులు కూడా అక్కడే ఉంటున్నారు. మరో ఇద్దరు సోదరులు మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్నారు. నరసింహారావు, పాండు, సత్యనారాయణ కుటుంబాల్లో మొత్తం 300 మంది ఉన్నారు. చిన్నవేడుక జరిగినా సరే.. మొత్తం 300మంది హాజరవ్వాల్సిందే. ఐదుగురు సోదరుల పిల్లల్లో కొందరు ప్రైవేటు ఉద్యోగాలు, మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకూ వీరు ఎక్కడికీ వెళ్లలేదు. విజయవాడ, వైజాగ్‌కు వెళ్దామంటూ నరసింహారావు ప్రతిపాదించగా..పాండు, సత్యనారాయణ కుటుంబీకులు అంగీకరించారు.

మృతుల కుటుంబాలను ఆదుకోండి..

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మృతుల బంధువు కొట్టం కృష్ణ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సానుభూతి తెలిపారు. సరైన వైద్యమందించాలని కోరారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అండ[గా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు.

ఇదీచదవండి

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- 11 మంది మృతి

విహారయాత్ర ఆ నాలుగు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖ జిల్లా అరకులోయ నుంచి కిందికి వస్తున్న ఓ టూరిస్టు బస్సు లోయలోకి దూసుకెళ్లి చిన్నారి సహా నలుగురు చనిపోయారు. మృతులు, క్షతగాత్రులంతా నాలుగు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు. హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన కె.సత్యనారాయణ రిజర్వు బ్యాంకులో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రల కోసం ఈనెల 10న దినేష్‌ ట్రావెల్స్‌ మినీ బస్సులో హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు.

అరకు ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం

విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం రాత్రి సింహాచలం వసతిగృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం అరకు వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో సరదాగా గడిపారు. బొర్రా గుహలను సందర్శించి తిరుగు ప్రయాణంలో రాత్రి ఏడింటికి బొర్రా, టైడాకు మధ్యన మలుపు వద్ద బస్సు లోయలో పడింది. సుమారు 80 అడుగుల లోతులో పడిపోవడంతో చిన్నారి శ్రీనిత్య (8నెలలు), కొట్టం సత్యనారాయణ (62), కె.సరిత (40), ఎన్‌.లత (40) ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఎస్‌.కోట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి అందరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

ప్రమాద వివరాల కోసం విశాఖ కలెక్టరేట్‌లో 0891 2590102, 0891 2590100 కంట్రోల్‌రూం నంబర్లను ఏర్పాటుచేశారు. అరకులోయ నుంచి తిరిగి వస్తున్నప్పుడే బస్సు బ్రేకులు ఫెయిలైనట్లు డ్రైవర్‌ శ్రీశైలం గుర్తించాడు. బస్సులోని వారికి తెలపడంతో వారు కేకలు వేశారు. అప్పటికే ఘాట్‌ రోడ్డు దిగువకు వస్తుండడంతో బస్సును నియంత్రించడం కష్టమైంది. అయిదో నంబర్‌ మలుపు వచ్చేసరికి నియంత్రణ సాధ్యంకాక నేరుగా లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన అరగంట తరువాత షాక్‌లోంచి తేరుకుని చూస్తే తాను చెట్టు కొమ్మకు వేలాడుతున్నానని, బస్సులోని వారంతా చెల్లాచెదురై ఉన్నారని క్షతగాత్రుడు నరేష్‌కుమార్‌ చెబుతున్నారు. వీరి బ్యాగులు, సామగ్రి అంతా సింహాచలంలోనే ఉంది. శుక్రవారం రాత్రి సింహాచలం చేరుకుని శనివారం స్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్లిపోవాలనుకున్నారు. ఇంతలో ఘోరం జరిగింది.

మా పాప ఎక్కడ?
తీవ్రంగా గాయపడిన మౌనికకు తన 8నెలల కుమార్తె శ్రీనిత్య చనిపోయిన విషయం తెలియదు. ఎస్‌.కోట ఆసుపత్రిలో చికిత్స పొంది స్పృహలోకి వచ్చాక ‘అందరూ కనిపిస్తున్నారు.. నా కూతురు ఎక్కడుందో చెప్పండ’ని కుటుంబీకులను అడగడం చూపరులను కలచివేసింది.

మృతులంతా హైదరాబాద్‌ వాసులే...

ఆధ్యాత్మిక, విహారయాత్ర నాలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బయలుదేరే ముందు అందరూ ఫొటోలు దిగుతూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. రోజుల వ్యవధిలోనే బస్సు ప్రమాదానికి గురికావడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమాచారం పూర్తిగా తెలియక నగరంలోని బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. రిజర్వ్‌బ్యాంకు అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన కొట్టం సత్యనారాయణ షేక్‌పేటలో నివసిస్తున్నారు. ఆయనకు వరసయ్యే సోదరులు నరసింహారావు, పాండులు కూడా అక్కడే ఉంటున్నారు. మరో ఇద్దరు సోదరులు మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్నారు. నరసింహారావు, పాండు, సత్యనారాయణ కుటుంబాల్లో మొత్తం 300 మంది ఉన్నారు. చిన్నవేడుక జరిగినా సరే.. మొత్తం 300మంది హాజరవ్వాల్సిందే. ఐదుగురు సోదరుల పిల్లల్లో కొందరు ప్రైవేటు ఉద్యోగాలు, మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకూ వీరు ఎక్కడికీ వెళ్లలేదు. విజయవాడ, వైజాగ్‌కు వెళ్దామంటూ నరసింహారావు ప్రతిపాదించగా..పాండు, సత్యనారాయణ కుటుంబీకులు అంగీకరించారు.

మృతుల కుటుంబాలను ఆదుకోండి..

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మృతుల బంధువు కొట్టం కృష్ణ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సానుభూతి తెలిపారు. సరైన వైద్యమందించాలని కోరారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అండ[గా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు.

ఇదీచదవండి

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు- 11 మంది మృతి

Last Updated : Feb 13, 2021, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.