ETV Bharat / state

ఆరు పదుల వయసులో.. 98 సార్లు రక్తదానం - విశాఖలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన వ్యక్తి తాజా వార్తలు

ఆరు పదులు దాటినా ఉత్సాహంగా రక్త దానం చేయడం కొంత అరుదే అయినా.. అతనికి మాత్రం చాలా సాధారణ విషయం. వందమార్లు తాను రక్తదాన లక్ష్యాన్ని చేరుకోవటంతో జీవితానికో సార్ధకత ఏర్పాటు చేసుకోవాలన్నది ఆ విశ్రాంత అధ్యాపకుడు పిళ్లా రమణమూర్తి అభిలాష. ఇప్పటికే 98 సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసి వీలైనంత మందిని ఆదుకోవాలనే చిన్న తపన ఆయనది.

98 సార్లు రక్తదానం చేసిన రమణమూర్తి
98 సార్లు రక్తదానం చేసిన రమణమూర్తి
author img

By

Published : Feb 24, 2021, 7:18 PM IST

Updated : Feb 25, 2021, 7:19 PM IST

98 సార్లు రక్తదానం చేసిన రమణమూర్తి

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందించడమే అతని కర్తవ్యం. ఒక సారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాన్ని కాపాడొచ్చన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే ఇప్పటివరకు 98 సార్లు రక్తదానం చేసేలా ప్రేరేపించింది. నిత్యం తన విధి నిర్వహణలో ఉంటూనే.. మరోవైపు సమాజంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. జాతీయ యువజన దినోత్సవం, యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌, రెడ్‌ క్రాస్‌ సంస్థ.. ఇలా సంస్థ ఏదైనా రక్తాన్ని దానం చేయడమే తన అభీష్టంగా మలుచుకున్నారు.

బీ.వీ.కె కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకులైన రమణ మూర్తి ఇటీవలే 98వసారి రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. నిత్య శారీరక వ్యాయామం, నియమబద్ధమైన ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. అందువల్లనే అన్ని సార్లు వైద్యప్రమాణాలు, కాలపరిమితులకు అనుగుణంగా రక్తదానం చేయడానికి వీలైందని చెబుతున్నారు. యువత సేవాస్ఫూర్తితో రక్త దానం చేయడానికి ముందుకు రావాలని తరచూ బోధిస్తారు. రక్తదానం చేయడం ద్వారా.. సమాజానికి ఉపయుక్తంగా ఉండాలని అచరణాత్మకంగా చూపుతున్నారు వెంకట రమణమూర్తి. కొవిడ్ వల్ల ఇప్పటికే వందసార్లు పూర్తికావాల్సిన తన రక్తదానం ఆలస్యమైందని ఆయన చెబుతున్నారు.

రమణమూర్తి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. వికలాంగులకు 60 వేల రూపాయల విలువైన పరికరాలను విరాళంగా ఇచ్చారు. యువత సామాజిక బాధ్యతపై దృష్టి పెట్టాలనేదే తన ఆకాంక్ష అంటున్నారు వెంకట రమణమూర్తి.

ఇవీ చూడండి...

ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభం..

98 సార్లు రక్తదానం చేసిన రమణమూర్తి

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందించడమే అతని కర్తవ్యం. ఒక సారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాన్ని కాపాడొచ్చన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే ఇప్పటివరకు 98 సార్లు రక్తదానం చేసేలా ప్రేరేపించింది. నిత్యం తన విధి నిర్వహణలో ఉంటూనే.. మరోవైపు సమాజంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. జాతీయ యువజన దినోత్సవం, యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌, రెడ్‌ క్రాస్‌ సంస్థ.. ఇలా సంస్థ ఏదైనా రక్తాన్ని దానం చేయడమే తన అభీష్టంగా మలుచుకున్నారు.

బీ.వీ.కె కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకులైన రమణ మూర్తి ఇటీవలే 98వసారి రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. నిత్య శారీరక వ్యాయామం, నియమబద్ధమైన ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. అందువల్లనే అన్ని సార్లు వైద్యప్రమాణాలు, కాలపరిమితులకు అనుగుణంగా రక్తదానం చేయడానికి వీలైందని చెబుతున్నారు. యువత సేవాస్ఫూర్తితో రక్త దానం చేయడానికి ముందుకు రావాలని తరచూ బోధిస్తారు. రక్తదానం చేయడం ద్వారా.. సమాజానికి ఉపయుక్తంగా ఉండాలని అచరణాత్మకంగా చూపుతున్నారు వెంకట రమణమూర్తి. కొవిడ్ వల్ల ఇప్పటికే వందసార్లు పూర్తికావాల్సిన తన రక్తదానం ఆలస్యమైందని ఆయన చెబుతున్నారు.

రమణమూర్తి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. వికలాంగులకు 60 వేల రూపాయల విలువైన పరికరాలను విరాళంగా ఇచ్చారు. యువత సామాజిక బాధ్యతపై దృష్టి పెట్టాలనేదే తన ఆకాంక్ష అంటున్నారు వెంకట రమణమూర్తి.

ఇవీ చూడండి...

ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభం..

Last Updated : Feb 25, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.