విశాఖ నగరానికి చెందిన చెరువు రామకోటయ్య బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ కమిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆర్ ఏన్ గుప్తా ఆయన నియామక వివరాలను ఓ ప్రకటనలో తెలియజేశారు.
ఈ కమిటీ సహ ఛైర్మన్లుగా చెన్నైకి చెందిన ఎల్ వెంకటేశం, గుజరాత్ వడోదరకి చెందిన సురేష్ సారియా, ముంబైకి చెందిన జై ప్రకాష్ భాటియా, దుర్గాపూర్కు చెందిన రవి బట్టడ్ నియమితులయ్యారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ సమస్యలపై అవగాహనతో.. సంస్థ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వివరించారు.
ఇదీ చదవండి: విశాఖ ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి జేడీ ఫౌండేషన్ వితరణ