ETV Bharat / state

సంతలే ప్రచార వేదికలు - పార్టీలకు మార్గాలు

author img

By

Published : Apr 4, 2019, 8:26 PM IST

జనం గుంపులుగా ఉండే సంతల్లో ప్రచారం చేయడం మామూలే. ఆ నియోజకవర్గంలో సంతలు మాత్రమే సురక్షిత ప్రచార వేదికలుగా భావిస్తారు అక్కడి నాయకులు. మారుమూల గ్రామాల ప్రజల మెప్పు పొందేందుకు అవే... సరైన మార్గమంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

సంతలే ప్రచార వేదికలు- పార్టీలకు ఏకైక మార్గాలు
సంతలే ప్రచార వేదికలు- పార్టీలకు ఏకైక మార్గాలు
విశాఖ మన్యంలో 11మండలాలు, 2 నియోజకవర్గాలు ఉన్నాయి. పాడేరు, అరకులోయ పరిధిలో ఎక్కువ భాగం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే. పాడేరులో ఎన్నికలు బహిష్కరించాలంటూ..నిత్యం మావోయిస్టులు హెచ్చరిస్తూనే ఉంటారు. అందుకే ఇక్కడ ప్రచారమంటేనే అభ్యర్థులు భయపడిపోతారు. కాస్త వెనకడుగూ వేస్తారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగేందుకు ఉన్న ఏకైక మార్గం సంతలే. పాడేరు నియోజకవర్గంలో రోజుకో మండలంలో ఏదో రోజు ఎక్కడో ప్రాంతంలో సంత జరుగుతుంది. ఆదివారం ధారకొండ, జర్రెల, రాజేంద్రపాలెం, వంట్లమామిడిలో... సోమవారం అన్నవరం... మంగళవారం జీమాడుగుల... బుధవారం చింతపల్లి... గురువారం జీకేవీధి, మద్దిగరువు, గుత్తులపుట్టు.... శనివారం సప్పరల్లో సంతలకు విపరీతంగా జనం వస్తారు. వీటికి పోలీసుల పటిష్ఠ భద్రత ఉంటుంది. అందుకే వీటినే ప్రచార వేదికలుగా చేసుకుని ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

పాడేరులో తెదేపా అభ్యర్థి శ్రావణ్ కుమార్, వైకాపా భాగ్యలక్ష్మి, జనసేన బాల్​రాజు, కాంగ్రెస్ సుబ్బారావు సంతల్లో తిరుగుతూ జనంలోకి వెళ్తున్నారు. ఎక్కడ ఎలా ప్రచారం చేసుకున్నా...ప్రధాన నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లేటప్పుడు మాత్రం తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి...

''నా కుమారుడిని గెలిపించండి.. మంచి చేస్తాడు''

సంతలే ప్రచార వేదికలు- పార్టీలకు ఏకైక మార్గాలు
విశాఖ మన్యంలో 11మండలాలు, 2 నియోజకవర్గాలు ఉన్నాయి. పాడేరు, అరకులోయ పరిధిలో ఎక్కువ భాగం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే. పాడేరులో ఎన్నికలు బహిష్కరించాలంటూ..నిత్యం మావోయిస్టులు హెచ్చరిస్తూనే ఉంటారు. అందుకే ఇక్కడ ప్రచారమంటేనే అభ్యర్థులు భయపడిపోతారు. కాస్త వెనకడుగూ వేస్తారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగేందుకు ఉన్న ఏకైక మార్గం సంతలే. పాడేరు నియోజకవర్గంలో రోజుకో మండలంలో ఏదో రోజు ఎక్కడో ప్రాంతంలో సంత జరుగుతుంది. ఆదివారం ధారకొండ, జర్రెల, రాజేంద్రపాలెం, వంట్లమామిడిలో... సోమవారం అన్నవరం... మంగళవారం జీమాడుగుల... బుధవారం చింతపల్లి... గురువారం జీకేవీధి, మద్దిగరువు, గుత్తులపుట్టు.... శనివారం సప్పరల్లో సంతలకు విపరీతంగా జనం వస్తారు. వీటికి పోలీసుల పటిష్ఠ భద్రత ఉంటుంది. అందుకే వీటినే ప్రచార వేదికలుగా చేసుకుని ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

పాడేరులో తెదేపా అభ్యర్థి శ్రావణ్ కుమార్, వైకాపా భాగ్యలక్ష్మి, జనసేన బాల్​రాజు, కాంగ్రెస్ సుబ్బారావు సంతల్లో తిరుగుతూ జనంలోకి వెళ్తున్నారు. ఎక్కడ ఎలా ప్రచారం చేసుకున్నా...ప్రధాన నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లేటప్పుడు మాత్రం తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి...

''నా కుమారుడిని గెలిపించండి.. మంచి చేస్తాడు''

Intro:AP_RJY_58_04_KPT_YSRCP_PRACHARAM_AV_C9
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి అన్నారు


Body:ఎన్నికల నేపథ్యంలో రావులపాలెం మండలం కోమరాజులంక, ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్యకర్తలు నాయకులు ఆయన వెంట బైక్ ర్యాలీ నిర్వహిస్తూ మద్దతు తెలిపారు ప్రచార రథం పై ఉండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు


Conclusion:మహిళలు ఆయన హారతి ఇస్తూ ఆశీర్వదించారు. ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.