ETV Bharat / state

పాఠశాలలో విద్యార్థులు చేరడానికి ఓ ఉపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం

author img

By

Published : Aug 6, 2020, 7:23 PM IST

పాఠశాలలో విద్యార్థులు చేరడానికి ఓ ఉపాధ్యాయుడు వినూత్న అడ్మిషన్లకు శ్రీకారం చుట్టాడు. విశాఖ జిల్లా దార్లపూడిలో ప్రతి ఒక విద్యార్థికి ఓ మొక్క అందించి.. తమ పాఠశాలలో చేరాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాడు.

plants distrubution to students at darlapudi
పాఠశాలలో విద్యార్థులు చేరడానికి ఓ ఉపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం

విశాఖ జిల్లా రోలుగుంట మండలం దార్లపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అడ్మిషన్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారు .అదే పాఠశాలకు చెందిన అప్పన రాంబాబు అనే ఉపాధ్యాయుడు వినూత్నంగా అడ్మిషన్లు చేస్తున్నాడు. ప్రతి ఇంటికి ఒక మొక్కను అందజేస్తూ ..ఇంట్లో ఉన్న విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించాలని అభ్యర్థిస్తున్నాడు. ఇప్పటికే ఇతను వృక్ష మిత్ర సమితి అనే సంస్థతో మొక్కల పెంపకం, పచ్చదనం, పరిశుభ్రత అనే కార్యక్రమం చేస్తున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులకు మొక్కను అందజేసి మొక్క బాధ్యత మీది... విద్యార్థి బాధ్యత మాది అనే నినాదంతో వారికి భరోసా ఇస్తున్నాడు.

విశాఖ జిల్లా రోలుగుంట మండలం దార్లపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అడ్మిషన్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారు .అదే పాఠశాలకు చెందిన అప్పన రాంబాబు అనే ఉపాధ్యాయుడు వినూత్నంగా అడ్మిషన్లు చేస్తున్నాడు. ప్రతి ఇంటికి ఒక మొక్కను అందజేస్తూ ..ఇంట్లో ఉన్న విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించాలని అభ్యర్థిస్తున్నాడు. ఇప్పటికే ఇతను వృక్ష మిత్ర సమితి అనే సంస్థతో మొక్కల పెంపకం, పచ్చదనం, పరిశుభ్రత అనే కార్యక్రమం చేస్తున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులకు మొక్కను అందజేసి మొక్క బాధ్యత మీది... విద్యార్థి బాధ్యత మాది అనే నినాదంతో వారికి భరోసా ఇస్తున్నాడు.

ఇదీ చూడండి.
కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.