ETV Bharat / state

NATUROPATHY: ప్రకృతి వైద్యంతో.. ప్రజలకు సేవలు

author img

By

Published : Jun 11, 2021, 7:19 PM IST

కరోనా కష్టకాలంలో సహజసిద్ధమైన వైద్యం వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. కృష్ణపట్నం ఆనందయ్య ఔషధానికి భారీ ఎత్తున ప్రచారం రావడం కూడా ఇందుకు దోహదపడింది. విశాఖలో ప్రకృతివైద్యుడు వెంకటరమణ.. ఉత్తరాంధ్ర ప్రజలకు తనవంతు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజల్లో చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చని చెబుతున్నారు.

NATUROPATHY: కరోనాతో ప్రకృతి వైద్యం వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు
NATUROPATHY: కరోనాతో ప్రకృతి వైద్యం వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు
NATUROPATHY: ప్రకృతి వైద్యంతో... ప్రజలకు వెంకటరమణ సేవలు
కరోనా నివారణలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం ఆశించిన ఫలితాలిస్తోందన్న ప్రచారంతో ప్రజలు ప్రకృతి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. సహజంగా మన పరిసరాల చుట్టూ అనేక వైద్య గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. పూర్వం ఆయుర్వేదంతోనే అన్ని చికిత్సలూ చేసేవారని వివరిస్తున్నారు. మన వంటింట్లో ఉండే పోపుల పెట్టే ఓ ప్రకృతి వైద్య పరికరమని స్పష్టం చేస్తున్నారు.

విశాఖ జిల్లా రాంబిల్లి మండలం రాజకోడూరుకు చెందిన వెంకటరమణ.. 25 ఏళ్లుగా ప్రకృతి వైద్యంతో ప్రజలకు సేవలందిస్తున్నారు. చక్కెరవ్యాధి, రక్తపోటు, శ్వాసకోస, ఉదర, హృదయ, ఎముకలకు సంబంధించిన స్వల్ప, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స అందిస్తున్నారు. తన వద్ద ఉండే ప్రకృతి వైద్య మూలికలతో పేదలకు ఉచితంగా, మిగిలిన వారికి నామమాత్రపు ధరలతో వైద్యం అందిస్తున్నారు.

ప్రకృతి వైద్యం కోసం వెంకటరమణ తనకున్న ఏడెకరాల పొలంలో ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఇంతకుముందు తృణధాన్యాలు పండించే వెంకటరమణ.. ఇప్పుడు కేవలం ఔషధ మొక్కలు, ప్రకృతి వైద్యానికి అవసరమైన ఇతర పాదులను పెంచుతున్నారు. వెంకటరమణ ప్రకృతి వైద్యం సత్ఫలితాలు ఇస్తోందని చికిత్స పొందిన రోగులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వెంకటరమణ వద్దకు ప్రకృతి వైద్యం కోసం రోగులు వస్తుంటారు.

ఇవీ చదవండి

10th, Inter Exams: పరీక్షలు ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదు: మంత్రి సురేశ్

NATUROPATHY: ప్రకృతి వైద్యంతో... ప్రజలకు వెంకటరమణ సేవలు
కరోనా నివారణలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం ఆశించిన ఫలితాలిస్తోందన్న ప్రచారంతో ప్రజలు ప్రకృతి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. సహజంగా మన పరిసరాల చుట్టూ అనేక వైద్య గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. పూర్వం ఆయుర్వేదంతోనే అన్ని చికిత్సలూ చేసేవారని వివరిస్తున్నారు. మన వంటింట్లో ఉండే పోపుల పెట్టే ఓ ప్రకృతి వైద్య పరికరమని స్పష్టం చేస్తున్నారు.

విశాఖ జిల్లా రాంబిల్లి మండలం రాజకోడూరుకు చెందిన వెంకటరమణ.. 25 ఏళ్లుగా ప్రకృతి వైద్యంతో ప్రజలకు సేవలందిస్తున్నారు. చక్కెరవ్యాధి, రక్తపోటు, శ్వాసకోస, ఉదర, హృదయ, ఎముకలకు సంబంధించిన స్వల్ప, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స అందిస్తున్నారు. తన వద్ద ఉండే ప్రకృతి వైద్య మూలికలతో పేదలకు ఉచితంగా, మిగిలిన వారికి నామమాత్రపు ధరలతో వైద్యం అందిస్తున్నారు.

ప్రకృతి వైద్యం కోసం వెంకటరమణ తనకున్న ఏడెకరాల పొలంలో ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఇంతకుముందు తృణధాన్యాలు పండించే వెంకటరమణ.. ఇప్పుడు కేవలం ఔషధ మొక్కలు, ప్రకృతి వైద్యానికి అవసరమైన ఇతర పాదులను పెంచుతున్నారు. వెంకటరమణ ప్రకృతి వైద్యం సత్ఫలితాలు ఇస్తోందని చికిత్స పొందిన రోగులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వెంకటరమణ వద్దకు ప్రకృతి వైద్యం కోసం రోగులు వస్తుంటారు.

ఇవీ చదవండి

10th, Inter Exams: పరీక్షలు ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేదు: మంత్రి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.