ఇటీవల వడదెబ్బకు గురైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన నీరసంగా ఉన్న కారణంగా.. ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని వైద్యులు సూచించారు. ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న కారణంగా.. ఆ సూచనను పవన్ తిరస్కరించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఎండ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు పవన్కు సూచించారని తెలిపాయి. ప్రచారం సమయంలో తాము అందుబాటులో ఉంటానని వైద్యులు చేసిన విజ్ఞప్తినీ పవన్ సున్నితంగా తిరస్కరించినట్టు వెల్లడించాయి. ఈ మేరకు.. అనకాపల్లి, పెందుర్తి సభలకు జనసేనాని హాజరు కానున్నారు.
నీరసంగా ఉన్నా.. ప్రచారానికే జై కొట్టిన పవన్!
జనసేన శ్రేణులను ఉత్సాహపరుస్తూ.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వడదెబ్బ నుంచి ఇంకా కోలుకోకపోయినా... సమయం తక్కువగా ఉన్న కారణంగా ప్రచారానికి వెళ్లేందుకు నిర్ణయించారు.
ఇటీవల వడదెబ్బకు గురైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన నీరసంగా ఉన్న కారణంగా.. ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని వైద్యులు సూచించారు. ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న కారణంగా.. ఆ సూచనను పవన్ తిరస్కరించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఎండ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు పవన్కు సూచించారని తెలిపాయి. ప్రచారం సమయంలో తాము అందుబాటులో ఉంటానని వైద్యులు చేసిన విజ్ఞప్తినీ పవన్ సున్నితంగా తిరస్కరించినట్టు వెల్లడించాయి. ఈ మేరకు.. అనకాపల్లి, పెందుర్తి సభలకు జనసేనాని హాజరు కానున్నారు.