ETV Bharat / state

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మరో మహిళ మృతి

author img

By

Published : May 27, 2020, 1:14 PM IST

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురు ఆస్పత్రిపాలయ్యారు. ఇంకా సమీప గ్రామాల ప్రజలు కోలుకోలేదు. ఆర్​.ఆర్ వెంకటాపురానికి చెందిన మహిళ మళ్లీ అస్వస్థతకు గురై నాలుగు రోజుల క్రితం కేజీహెచ్‌లో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందింది.

LG POLYMERS
LG POLYMERS

విశాఖ విషవాయువు ఘటన సమీప ప్రాంత ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురై కోలుకుని ఇంటికి వచ్చిన వారు మళ్లీ జబ్బు పడుతున్నారు. ఆర్‌.ఆర్‌.వెంకటాపురం వాసి వెంకాయమ్మ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయింది. కానీ ఆమె పూర్తిగా కోలుకోలేదు. మళ్లీ అస్వస్థతకు గురై నాలుగు రోజుల క్రితం కేజీహెచ్‌లో చేరింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి వెంకాయమ్మ(84) మృతి చెందింది. వెంకాయమ్మ మృతిపై గోపాలపట్నం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో అస్వస్థతకు గురైన వెంకాయమ్మ గతంలో ప్రభుత్వం నుంచి రూ.లక్ష పరిహారం పొందింది.

విశాఖ విషవాయువు ఘటన సమీప ప్రాంత ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురై కోలుకుని ఇంటికి వచ్చిన వారు మళ్లీ జబ్బు పడుతున్నారు. ఆర్‌.ఆర్‌.వెంకటాపురం వాసి వెంకాయమ్మ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయింది. కానీ ఆమె పూర్తిగా కోలుకోలేదు. మళ్లీ అస్వస్థతకు గురై నాలుగు రోజుల క్రితం కేజీహెచ్‌లో చేరింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి వెంకాయమ్మ(84) మృతి చెందింది. వెంకాయమ్మ మృతిపై గోపాలపట్నం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో అస్వస్థతకు గురైన వెంకాయమ్మ గతంలో ప్రభుత్వం నుంచి రూ.లక్ష పరిహారం పొందింది.

ఇదీ చదవండి: రిక్షావాలా కథ: 8 రోజులు- 11 రిక్షాలు- 1100 కి.మీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.