విశాఖ జిల్లా మాడుగుల పంచాయతీకి చెందిన ఇంటి పన్నులు, సంత వేలం పాట నుంచి వచ్చిన నిధులను పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా సిబ్బంది పక్కదారి పట్టించిన వైనంపై ఈటీవీ భారత్ కథనం ప్రచురించింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి దీనిపై ఆరా తీశారు.
గ్రామ పంచాయతీకి చెందిన రూ.33 లక్షల మేరకు నిధులు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. వాటిలో ఇప్పటికే రూ.20 లక్షలు పంచాయతీ ఖాతాలో జమ చేశారు. మిగిలిన నిధులు రికవరీ చేస్తామని నర్సీపట్నం డీఎల్పీవో శిరీషారాణి చెప్పారు. ఈ మేరకు మాడుగుల ఈవో పీఆర్డీ మీనాకుమారి ఆదేశాలతో పంచాయతీ ఈవో సత్యనారాయణ, సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. తక్షణమే పంచాయతీ నిధులు జమ చేయాలని ఆదేశించారు.
ఇవీ చదవండి...