చోడవరంలో 50 పడకలతో ప్రత్యేక వార్డు విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 50 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టారు. నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో ప్రైవేటు బీఈడీ కళాశాలలో కోవిడ్-19 వార్డు ఏర్పాటు చేస్తున్నారు. కళాశాల ప్రాంగణాన్ని రెవెన్యూ, పోలీసు, వైద్య అధికారులతో కలిసి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరిశీలించారు.
ఇవీ చదవండి: కరోనా పంజా: 17 మరణాలు- 724 కేసులు