ETV Bharat / state

డంపింగ్ యార్డ్​ను ప్రభుత్వ స్థలంలోకి తరలించాలి : మౌర్య

author img

By

Published : Apr 5, 2021, 1:05 AM IST

విశాఖ జిల్లా రావికమతం డంపింగ్​యార్డును నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. ఈ డంపింగ్ యార్డ్ ద్వారా స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, దీనిని ప్రభుత్వ స్థలంలో తరలించాలని అధికారులను ఆదేశించారు.

narsipatnam sub collector narapareddy mourya
నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య

విశాఖపట్నం జిల్లా రావికమతం మండల కేంద్రంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆదేశించారు. ఈ డంపింగ్ యార్డ్ సమీపంలో అంగన్​వాడీ కేంద్రం ఉండటంతో... పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు సబ్ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డంపింగ్ యార్డును పరిశీలించి సబ్ కలెక్టర్... డంపింగ్ యార్డును ప్రభుత్వ స్థలంలో తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ విషయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.

విశాఖపట్నం జిల్లా రావికమతం మండల కేంద్రంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆదేశించారు. ఈ డంపింగ్ యార్డ్ సమీపంలో అంగన్​వాడీ కేంద్రం ఉండటంతో... పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు సబ్ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డంపింగ్ యార్డును పరిశీలించి సబ్ కలెక్టర్... డంపింగ్ యార్డును ప్రభుత్వ స్థలంలో తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ విషయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.

ఇదీచదవండి.

ఛత్తీస్​గఢ్​లో ఎదురుకాల్పులు... రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.