ETV Bharat / state

పాఠశాలల అభివృద్ధికి నాబార్డు నిధులు

author img

By

Published : Jul 17, 2020, 6:39 PM IST

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో పలు పాఠశాలల అభివృద్ధికి నాబార్డు నిధులు విడుదల చేసింది. ఈమేరకు మంజురైన నిధులు వివరాలను ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వెల్లడించారు.

NABARD funds for the development of schools
పలు పాఠశాలల అభివృద్ధికి నాబార్డు నిధులు

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అభివృద్ధికి రూ.4.44 కోట్లు నిధులు విడుదలయ్యాయి. నాబార్డు కింద ఈ నిధులు మంజురయ్యాయని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. త్వరలోనే పాఠశాలలలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం రూ.1.60 కోట్లు, పి.ఎస్.పేట ఉన్నత పాఠశాలను రూ.1.08 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. రావికమతం ఉన్నత పాఠశాలకు రూ.45.20 లక్షలు, రోలుగుంట ఉన్నత పాఠశాలకు రూ.84.90 లక్షలు, బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి ఉన్నత పాఠశాలకు రూ. 46.50 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అభివృద్ధికి రూ.4.44 కోట్లు నిధులు విడుదలయ్యాయి. నాబార్డు కింద ఈ నిధులు మంజురయ్యాయని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. త్వరలోనే పాఠశాలలలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం రూ.1.60 కోట్లు, పి.ఎస్.పేట ఉన్నత పాఠశాలను రూ.1.08 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. రావికమతం ఉన్నత పాఠశాలకు రూ.45.20 లక్షలు, రోలుగుంట ఉన్నత పాఠశాలకు రూ.84.90 లక్షలు, బుచ్చెయ్యపేట మండలం దిబ్బిడి ఉన్నత పాఠశాలకు రూ. 46.50 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి...

ఆన్‌లైన్​లో అప్పన్న ఆర్జిత సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.