ETV Bharat / state

విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

author img

By

Published : Mar 10, 2021, 10:06 AM IST

Updated : Mar 10, 2021, 11:41 AM IST

విశాఖ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు, పోలీసులు.. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

municipal elections polling in vishakapatnam
విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

విశాఖ జిల్లాలో పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు శానిటైజర్లు వాడేలా ఏర్పాట్లు చేశారు.

నర్సీపట్నంలో

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 28 వార్డులకు.. 47, 389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 18, సాధారణ సమస్యాత్మక ప్రాంతాలు 22గా గుర్తించారు. ఇందుకోసం 374 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. 56 బ్యాలెట్ బాక్స్ లను ఏర్పాటు చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి, శారదానగర్, బలిఘట్టం తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నర్సీపట్నం శారదానగర్ 16b పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియ అరగంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల వరకు 22 శాతం పోలింగ్ నమోదైంది.

ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు నేతలు

నర్సీపట్నం ఐదు రోడ్ల కూడలి వద్ద 25వ వార్డులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. శారదా నగర్​లోని 16వ పోలింగ్ బూతు వద్ద నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనకాపల్లిలో

అనకాపల్లి జీవీఎంసీ జోన్ పరిధిలోని 5 వార్డులకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో పలు పార్టీల నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 14 వార్డులో.. మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినయోగించుకున్నారు. ప్రజలు సక్రమంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పెందుర్తిలో ప్రశాంతంగా పోలింగ్

పెందుర్తిలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓట్లు వేయడానికి యువత అధిక సంఖ్యలో బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డీసీపీ శ్రీపాదరావు పోలింగ్ బూత్​ల వద్ద ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న గంటా శ్రీనివాసరావు

గ్రేటర్ విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంవీపీ కాలనీలో ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్​లో.. 17వ వార్డులో ఉదయం 9 గంటలకు ఓటు వేశారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటింగ్ జరుగుతున్న సరళిపై గంటా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

తెదేపా అఖండ విజయాన్ని సాధిస్తుంది: ఎమ్మెల్యే వెలగపూడి

పురపాలక ఎన్నికల్లో భాగంగా.. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెదేపా అఖండ విజయాన్ని సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓటింగ్ శాతం పెరిగే అవకాశం: బోలిశెట్టి సత్యనారాయణ

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. బోలిశెట్టి సత్యనారాయణ విశాఖలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని బొలిశెట్టి అన్నారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పురరపాలక పోలింగ్‌

విశాఖ జిల్లాలో పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు శానిటైజర్లు వాడేలా ఏర్పాట్లు చేశారు.

నర్సీపట్నంలో

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 28 వార్డులకు.. 47, 389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 18, సాధారణ సమస్యాత్మక ప్రాంతాలు 22గా గుర్తించారు. ఇందుకోసం 374 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. 56 బ్యాలెట్ బాక్స్ లను ఏర్పాటు చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి, శారదానగర్, బలిఘట్టం తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నర్సీపట్నం శారదానగర్ 16b పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియ అరగంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల వరకు 22 శాతం పోలింగ్ నమోదైంది.

ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు నేతలు

నర్సీపట్నం ఐదు రోడ్ల కూడలి వద్ద 25వ వార్డులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. శారదా నగర్​లోని 16వ పోలింగ్ బూతు వద్ద నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనకాపల్లిలో

అనకాపల్లి జీవీఎంసీ జోన్ పరిధిలోని 5 వార్డులకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో పలు పార్టీల నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 14 వార్డులో.. మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినయోగించుకున్నారు. ప్రజలు సక్రమంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పెందుర్తిలో ప్రశాంతంగా పోలింగ్

పెందుర్తిలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓట్లు వేయడానికి యువత అధిక సంఖ్యలో బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డీసీపీ శ్రీపాదరావు పోలింగ్ బూత్​ల వద్ద ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న గంటా శ్రీనివాసరావు

గ్రేటర్ విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంవీపీ కాలనీలో ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్​లో.. 17వ వార్డులో ఉదయం 9 గంటలకు ఓటు వేశారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటింగ్ జరుగుతున్న సరళిపై గంటా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

తెదేపా అఖండ విజయాన్ని సాధిస్తుంది: ఎమ్మెల్యే వెలగపూడి

పురపాలక ఎన్నికల్లో భాగంగా.. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెదేపా అఖండ విజయాన్ని సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓటింగ్ శాతం పెరిగే అవకాశం: బోలిశెట్టి సత్యనారాయణ

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. బోలిశెట్టి సత్యనారాయణ విశాఖలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని బొలిశెట్టి అన్నారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పురరపాలక పోలింగ్‌

Last Updated : Mar 10, 2021, 11:41 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.