ETV Bharat / state

విశాఖలో అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన

విశాఖ జిల్లాలో సుమారు రూ.కోటి 20 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు... మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.

author img

By

Published : Oct 10, 2020, 10:45 PM IST

Minister Avanti srinivas lays foundation stone for development works in Visakhapatnam
విశాఖలో అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన

విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో సుమారు రూ.కోటి 20 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. రెడ్డిపల్లిలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన పశువైద్యశాలను మంత్రి ప్రారంభించారు. తునివలసలో రైతుభరోసా కేంద్రం, సీసీ రహదారులతో పాటు చిన్నాపురంలో బస్ షెల్టర్ తదితర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 31 పథకాలలో ప్రతిఒక్కరు ఏదో ఒక పథకంలో లబ్ధిదారులై ఉన్నారని మంత్రి అవంతి అన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో సుమారు రూ.కోటి 20 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. రెడ్డిపల్లిలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన పశువైద్యశాలను మంత్రి ప్రారంభించారు. తునివలసలో రైతుభరోసా కేంద్రం, సీసీ రహదారులతో పాటు చిన్నాపురంలో బస్ షెల్టర్ తదితర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 31 పథకాలలో ప్రతిఒక్కరు ఏదో ఒక పథకంలో లబ్ధిదారులై ఉన్నారని మంత్రి అవంతి అన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఇదీ చదవండి:

అంతర్వేది ఫిషింగ్ హార్బర్​లో 90 శాతం పనులు పూర్తి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.