ETV Bharat / state

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి: అవంతి

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ మహిళలకు సూచించారు. పొదుపు సంఘాల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

author img

By

Published : Jul 20, 2019, 1:45 PM IST

minister-avanthi-srinivas
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి: అవంతి

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. విశాఖ ఆరిలోవలోని పొదుపు సంఘాల మహిళల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను బడికి పంపి అమ్మఒడి పథకంలో భాగస్వామ్యం కావాలని చెప్పారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి: అవంతి

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. విశాఖ ఆరిలోవలోని పొదుపు సంఘాల మహిళల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను బడికి పంపి అమ్మఒడి పథకంలో భాగస్వామ్యం కావాలని చెప్పారు.

Intro:భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ కేంద్రం నుంచి మొట్టమొదటి సారిగా అత్యంత బరువైన 3.8 టన్నుల చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ మార్కు3 ఎం1 వాహక నౌక సోమవారం రోదసిలోకి మోసుకెళ్ళనుంది. ఇప్పటి వరకు ఇసో ఇంతటి బరువైన ఉపగ్రహంను షార్ నుంచి పంపలేదు. గతంలో 2017 మే 6న జీఎస్ఎల్వీ మార్కు3డి1ద్వారా 3.1 టనుల బరువు గల జీశాట్ -19 ఉపగ్రహం ను కక్ష్య లోకి పంపారు.2018సం నవంబర్14న జీఎస్ఎల్వీ మార్కు3డి2 వాహకనౌక ద్వారా 3.4 టనుల బరువు గల జీశాట్ 29 ఉపగ్రహంను రోదసిలోకి పంపారు. అత్యంత బరువైన ఉపగ్రహాలను కక్షలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ మార్కు3 వాహకనౌక వినియోగించడం జరుగుతుంది. రూ.978 కోట్లు ఖర్చు తో చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Body:నెల్లూరు జిల్లా శ్రీ హరికోట లోని సతీష్ ధవన్ పరిశోధన కేంద్రం నుంచి చంద్రయాన్-2ప్రయోగం సక్సెస్ చేయడానికి శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు సిబ్బంది రేయింబవళ్లు శ్రమ పడుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన సత్తా చాటేందుకు ఈ ప్రయోగం చేస్తోంది. ఈనెల 15 వేకువజామున జరగాల్సిన ప్రయోగం వాయిదా పడిన సంగతి తెలిసిందే. వారం రోజుల తర్వాత మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేయడం సవాలుగా చెప్పొచ్చు.2013సం ఆగస్టు నెలలో జీఎస్ఎల్వీ డి5 ప్రయోగం చేసేందుకు సిద్ధమయారు.వాహకనౌక లోని రెండో దశలో లీకేజీ ఏర్పడటంతో అప్పట్లో వాయిదా వేశారు. అయినా శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసంతో పని చేసి జనవరి 5న ప్రయోగం విజయవంతం చేశారు. అయితే ఇప్పుడు మాత్రం వారం రోజుల సమయంలో ప్రయోగానికి రెడీ అవడం చెప్పుకోదగ్గ విషయం. ఇందుకోసం నిపుణుల బృందం షార్ లోనే ఉండి సిద్ధం చేస్తున్నారు.కయోజనిక్ ఇంధనంలో ఏర్పడిన లోపంపై సమీక్ష నిర్వహించారు.రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ మార్కు3ఎం1 వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్స్ శుక్రవారం విజయవంతంగా జరిపారు. సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు జీఎస్ఎల్వీ మార్కు3ఎం1 నింగిలోకి దూసుకెళ్లనుంది..
నోట్. సార్ చంద్రయాన్-2 ఫైల్ విజువల్స్ వాడగలరు.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.