ETV Bharat / state

కుళాయి కనెక్షన్​ల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు : జేసీ - విశాఖ జిల్లా కలెక్టరేట్​

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తాగునీటి పథకంలో భాగంగా గురువారం విశాఖ జిల్లా కలెక్టరేట్​లో జేసీ అరుణ్ బాబు సమీక్ష నిర్వహించారు. జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా అధికారులతో సమీక్షించి కుళాయి కనెక్షన్​ల ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించాలని ఆదేశించారు.

కుళాయి కనెక్షన్​ల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు : జేసీ
కుళాయి కనెక్షన్​ల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు : జేసీ
author img

By

Published : Oct 15, 2020, 6:53 PM IST

వచ్చే ఏడాది జనవరి 10 నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్​వాడీలకు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని విశాఖ జేసీ అరుణ్ బాబు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జాతీయ జల జీవన్​లో భాగంగా..

కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖలో తాగునీరు, శానిటేషన్ విభాగం 2024లోగా జాతీయ జల జీవన్ మిషన్ కార్యక్రమం కింద నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్ ద్వారా ఇంటింటికి మంచి నీటి సరఫరాకు కేంద్రం రూపకల్పన చేసిందన్నారు.

జనవరి 10లోగా..

వంద రోజుల కార్యక్రమంలో భాగంగా వచ్చే జనవరి 10 లోగా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, అంగన్ వాడీలు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలకు కుళాయి కనెక్షన్​ల ద్వారా తాగునీటి సరఫరా లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

శుభ్రమైన తాగునీరు..

ఇందులో భాగంగా రక్షిత, పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ పనులను పూర్తి చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు నిర్వహణ బాధ్యతలు చేపడతాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : అమరావతికి ఏం కాదు.. అవి తప్పుడు ప్రచారాలు: రైతులు

వచ్చే ఏడాది జనవరి 10 నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్​వాడీలకు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని విశాఖ జేసీ అరుణ్ బాబు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జాతీయ జల జీవన్​లో భాగంగా..

కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖలో తాగునీరు, శానిటేషన్ విభాగం 2024లోగా జాతీయ జల జీవన్ మిషన్ కార్యక్రమం కింద నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్ ద్వారా ఇంటింటికి మంచి నీటి సరఫరాకు కేంద్రం రూపకల్పన చేసిందన్నారు.

జనవరి 10లోగా..

వంద రోజుల కార్యక్రమంలో భాగంగా వచ్చే జనవరి 10 లోగా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, అంగన్ వాడీలు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలకు కుళాయి కనెక్షన్​ల ద్వారా తాగునీటి సరఫరా లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

శుభ్రమైన తాగునీరు..

ఇందులో భాగంగా రక్షిత, పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ పనులను పూర్తి చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు నిర్వహణ బాధ్యతలు చేపడతాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : అమరావతికి ఏం కాదు.. అవి తప్పుడు ప్రచారాలు: రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.