ETV Bharat / state

ఎల్జీపాలిమర్స్ ఘటనకు ఏడాది పూర్తి.. మృతులకు గ్రామప్రజలు నివాళి

author img

By

Published : May 7, 2021, 8:11 AM IST

సరిగ్గా ఏడాది క్రితం విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన పెను సంచలనమే సృష్టించింది. అనేక మంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచిన ఆ ఘోరం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ ఘటన జరిగి సంవత్సరం పూర్తి కావడంతో ఆ గ్రామాల ప్రజలు మరణించిన వారికి నివాళులర్పించారు.

lg polymers nivali
lg polymers nivali

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘట జరిగి నేటికి ఏడాది. ఈ ఘటనలో మరణించిన వారికి బాధిత గ్రామాల్లో ప్రజలు నివాళులర్పించారు. వెంకటాపురం, వెంకటాద్రిగార్డెన్స్, నందగిరినగర్, ఎస్సీకాలనీ, జనతాకాలనీ, తదితర ప్రాంతాలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. కొవిడ్‌ కారణంగా ఎవరి ఇళ్ల వద్ద వారు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘట జరిగి నేటికి ఏడాది. ఈ ఘటనలో మరణించిన వారికి బాధిత గ్రామాల్లో ప్రజలు నివాళులర్పించారు. వెంకటాపురం, వెంకటాద్రిగార్డెన్స్, నందగిరినగర్, ఎస్సీకాలనీ, జనతాకాలనీ, తదితర ప్రాంతాలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. కొవిడ్‌ కారణంగా ఎవరి ఇళ్ల వద్ద వారు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు.

ఇదీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్​ లీకేజీ: ఇంకా కళ్ల ముందే దుర్ఘటన దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.