ETV Bharat / state

దిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా వామపక్షాల నిరసన

author img

By

Published : Dec 14, 2020, 5:24 PM IST

మూడు వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ దిల్లీ రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రైతన్నలకు మద్దతుగా విశాఖలో వామపక్ష పార్టీలు నిరసనలు చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లులు కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూరే విధంగా ఉన్నాయని ఆరోపించారు. వీటిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

దిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా వామపక్షాలు నిరసన
దిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా వామపక్షాలు నిరసన

దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా విశాఖలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐదు వందల రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వామపక్షాలు, కార్మిక, ప్రజా సంఘాలు, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎల్​ఐసీ భవనం వరకు ప్రదర్శనలో పాల్గొన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లులు... కార్పొరేట్ కంపెనీలకు లబ్దిచేకూరే విధంగా ఉన్నాయని... వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే దిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్న వారికి మద్దతుగా రాష్ట్రాలవారీగా విరాళాలు సేకరించి పంపించడం జరుగుతుందని తెలిపారు.

దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా విశాఖలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐదు వందల రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వామపక్షాలు, కార్మిక, ప్రజా సంఘాలు, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎల్​ఐసీ భవనం వరకు ప్రదర్శనలో పాల్గొన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లులు... కార్పొరేట్ కంపెనీలకు లబ్దిచేకూరే విధంగా ఉన్నాయని... వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే దిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్న వారికి మద్దతుగా రాష్ట్రాలవారీగా విరాళాలు సేకరించి పంపించడం జరుగుతుందని తెలిపారు.

ఇవీ చదవండి

ఏవోబీలో హై టెన్షన్... కొనసాగుతున్న కూంబింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.