దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా విశాఖలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐదు వందల రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వామపక్షాలు, కార్మిక, ప్రజా సంఘాలు, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎల్ఐసీ భవనం వరకు ప్రదర్శనలో పాల్గొన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లులు... కార్పొరేట్ కంపెనీలకు లబ్దిచేకూరే విధంగా ఉన్నాయని... వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే దిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్న వారికి మద్దతుగా రాష్ట్రాలవారీగా విరాళాలు సేకరించి పంపించడం జరుగుతుందని తెలిపారు.
ఇవీ చదవండి