విశాఖ జిల్లాలో జల్ జీవన్ మిషన్ నైపుణ్య శిక్షణ తరగతులను ఆర్డబ్ల్యూఎస్.. ఎస్ఈ రవికుమార్ ప్రారంభించారు. సురక్షితమైన జలాలను ఇంటింటికి అందించడంలో నైపుణ్య వంతమైన కార్మికులు అవసరమని గుర్తించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పదిహేను రోజులపాటు మూడు దశల్లో నిర్వహించే ఈ శిక్షణకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ కూడా సహకారం అందిస్తుందన్నారు. శిక్షణ అనంతరం కార్మికులకు న్యాక్ ధ్రువ పత్రాలను అందిస్తుందన్నారు.
ఇదీ చదవండి: కూలిన పెంకుటిల్లు... ధ్వంసమైన సామగ్రి