క్వారంటైన్కు 33 మంది వలస కూలీలు - వలస కూలీల వార్తలు
విశాఖ మన్యం జి.మాడుగుల మండలానికి చెందిన 33 మంది వలస కూలీలను అధికారులు క్వారంటైన్కు తరలించారు. వీరింతా వివిధ పనుల నిమిత్తం విజయవాడ, మచిలీపట్నానికి వెళ్లారు. లాక్డౌన్ తరువాత గ్రామాలకు చేరుకోవటంతో అధికారులు వీరిని గుర్తించి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు 14 రోజులపాటు వీరిని క్వారంటైన్లో ఉంచనున్నారు. వీరంతా జి.మాడుగుల మండలం చెందిన సొలభం, పెదలోచలి పంచాయతీల గ్రామాల వాసులు.