ETV Bharat / state

సింహాచలం అప్పన్న ఆదాయం 91 లక్షలు

23 రోజుల్లో నృశింహ స్వామి వారి హుండీ ఆదాయం 91 లక్షలకు పైగా సమకూరింది

author img

By

Published : Mar 30, 2019, 5:51 AM IST

హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది
హుండీ ఆదాయం
విశాఖ జిల్లాసింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృశింహ స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీలను అధికారులు తెరిచారు. బేడా మండపంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమక్షంలో పలు స్వచ్ఛంద సంస్దల వారు లెక్కింపు చేపట్టారు. గడిచిన 23 రోజులకు గాను 91లక్షల40వేల 946 రూపాయల నగదుతో పాటు 141 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి వస్తువులతో పాటు వివిధ దేశాలకు చెందిన డాలర్లు కూడా హుండీలలో లభించాయని అధికారులు తెలిపారు. సుమారు 2 లక్షలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నందున ఆదాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.

హుండీ ఆదాయం
విశాఖ జిల్లాసింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృశింహ స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీలను అధికారులు తెరిచారు. బేడా మండపంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమక్షంలో పలు స్వచ్ఛంద సంస్దల వారు లెక్కింపు చేపట్టారు. గడిచిన 23 రోజులకు గాను 91లక్షల40వేల 946 రూపాయల నగదుతో పాటు 141 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి వస్తువులతో పాటు వివిధ దేశాలకు చెందిన డాలర్లు కూడా హుండీలలో లభించాయని అధికారులు తెలిపారు. సుమారు 2 లక్షలమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నందున ఆదాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.