ETV Bharat / state

విశాఖలో ఘనంగా గోపూజ మహోత్సవం - విశాఖ జిల్లాలో విశాఖలో ఘనంగా గోపూజ తాజా వార్తలు

కనుమ పండుగను పురష్కరించుకుని విశాఖ జిల్లాలో ఘనంగా గోమాతలకు పూజలు నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కొత్త గోశాల‌లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గోవులకు పూజలు చేశారు.

Gopuja festival celebrated
విశాఖలో ఘనంగా గోపూజ మహోత్సవం
author img

By

Published : Jan 15, 2021, 5:11 PM IST

విశాఖలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ పండుగ రోజున గోపూజ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలోని కొత్త గోశాల‌లో గోవులను పూజించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 200కు పైగా దేశీయ జాతుల‌కు చెందిన గోవులు, ఎద్దులు, దూడ‌లు ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ అలంకరించి, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజ‌లు నిర్వ‌హించారు. గోవులకు ఇష్టమైన ఆహారాన్ని, ఎండు, పచ్చగడ్డి, అర‌టి పండ్ల‌ను అందించారు.

సింహాచలం దేవస్థానంలో తరతరాలుగా గోపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు అన్నింటిలోనూ కనుమ రోజు పూజలు నిర్వహించాలని ఈఏడాది దేవాదాయశాఖ ఆదేశించింది. దీంతో మ‌రింత శోభాయ‌మానంగా కనుమ పండుగ నాడు పశువులను పూజించి.. వాటి ప‌ట్ల త‌మ‌కున్న భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌ను చాటి చెప్పారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో కనుమ పండుగ పురస్కరించుకొని దేవాలయంలో గోపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, సిద్ధి లింగేశ్వర స్వామి, మల్లి మనుగడవారి వీధి లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోపూజలు నిర్వహించారు.

విశాఖలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ పండుగ రోజున గోపూజ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలోని కొత్త గోశాల‌లో గోవులను పూజించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 200కు పైగా దేశీయ జాతుల‌కు చెందిన గోవులు, ఎద్దులు, దూడ‌లు ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ అలంకరించి, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజ‌లు నిర్వ‌హించారు. గోవులకు ఇష్టమైన ఆహారాన్ని, ఎండు, పచ్చగడ్డి, అర‌టి పండ్ల‌ను అందించారు.

సింహాచలం దేవస్థానంలో తరతరాలుగా గోపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు అన్నింటిలోనూ కనుమ రోజు పూజలు నిర్వహించాలని ఈఏడాది దేవాదాయశాఖ ఆదేశించింది. దీంతో మ‌రింత శోభాయ‌మానంగా కనుమ పండుగ నాడు పశువులను పూజించి.. వాటి ప‌ట్ల త‌మ‌కున్న భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌ను చాటి చెప్పారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో కనుమ పండుగ పురస్కరించుకొని దేవాలయంలో గోపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, సిద్ధి లింగేశ్వర స్వామి, మల్లి మనుగడవారి వీధి లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోపూజలు నిర్వహించారు.

ఇవీ చూడండి...

కనుమ సందర్భంగా విశాఖ శారదాపీఠంలో గోపూజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.