ETV Bharat / state

940 కేజీల గంజాయి పట్టివేత

author img

By

Published : Jun 18, 2020, 12:25 PM IST

విశాఖ జిల్లాలో 75 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 940 కేజీల గంజాయిని లారీలో తరలిస్తుండగా లంబసింగి వద్ద పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ganja seized
ganja seized

విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ.75 లక్షలు విలువైన గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లోని గంజాయిని కొనుగోలు చేసి.. మధ్యప్రదేశ్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు లారీలో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న చింతపల్లి ఎక్సైజ్ సీఐ సింహాద్రి.. సిబ్బందితో లంబసింగి​లో తనఖీలు నిర్వహించారు. గంజాయిని తరలిస్తున్న నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లారీతో సహా 940 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశామని.. ఎక్సైజ్ సీఐ సింహాద్రి తెలిపారు.

విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ.75 లక్షలు విలువైన గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లోని గంజాయిని కొనుగోలు చేసి.. మధ్యప్రదేశ్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు లారీలో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న చింతపల్లి ఎక్సైజ్ సీఐ సింహాద్రి.. సిబ్బందితో లంబసింగి​లో తనఖీలు నిర్వహించారు. గంజాయిని తరలిస్తున్న నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లారీతో సహా 940 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశామని.. ఎక్సైజ్ సీఐ సింహాద్రి తెలిపారు.

ఇదీ చదవండి: చైనా ఆ కారణంతోనే భారత్​ను రెచ్చగొడుతోందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.