ETV Bharat / state

విశాఖ నుంచి కర్ణాటకకు ఫ్లైయాష్​​ రవాణా - విశాఖ నుంచి కర్ణాటకకు ఫ్లైయాష్ వార్తలు

విశాఖ నుంచి కర్ణాటకకు ఫ్లైయాష్​ రవాణా ప్రారంభమైంది. ఎన్టీపీసీ సింహాద్రి ప్లాంట్​ నుంచి బయలుదేరిన రైలుకు వాల్తేర్ డీఆర్ఎం పచ్చజెండా ఊపారు.

fly ash
విశాఖ నుంచి కర్ణాటకకు ఫ్లైయాష్​​ రవాణా
author img

By

Published : Jan 1, 2021, 12:56 PM IST

విశాఖ నుంచి కర్ణాటకకు రైలు ద్వారా ఫ్లైయాష్​ రవాణా ప్రారంభమైంది. కొత్త కార్గో రవాణాలో భాగంగా ఫ్లైయాషను ఎన్టీపీసీ సింహాద్రి ప్లాంట్ నుంచి కర్ణాటకలోని తొండిబావి స్టేషన్​లోని.. ఏసీపీ సిమ్మెంట్ ప్లాంట్​కి రవాణా చేస్తున్నారు.

విశాఖ నుంచి 944 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండిబావి స్టేషన్​కు కంటైనర్​ల ద్వారా ఫ్లైయాష్​ను చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి బయల్దేరిన తొలి కార్గో రైలును వాల్తేర్ డీఆర్​ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

మెుదటగా సింహాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి నైరుతి రైల్వేలోని తొండిబావి స్టేషన్​కి ఈ రైలు ద్వారా.. 4 వేల టన్నుల ఫ్లైయాష్ రవాణా చేశారు. రైలు ద్వారా పూర్తిగా కంటైనర్లలలో ఫ్లైయాష్​ తరలింపు వల్ల పర్యావరణానికి విఘాతం కలగకుండా చేయగలిగారు.

ఇదీ చదవండి: విశాఖలో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు

విశాఖ నుంచి కర్ణాటకకు రైలు ద్వారా ఫ్లైయాష్​ రవాణా ప్రారంభమైంది. కొత్త కార్గో రవాణాలో భాగంగా ఫ్లైయాషను ఎన్టీపీసీ సింహాద్రి ప్లాంట్ నుంచి కర్ణాటకలోని తొండిబావి స్టేషన్​లోని.. ఏసీపీ సిమ్మెంట్ ప్లాంట్​కి రవాణా చేస్తున్నారు.

విశాఖ నుంచి 944 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండిబావి స్టేషన్​కు కంటైనర్​ల ద్వారా ఫ్లైయాష్​ను చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి బయల్దేరిన తొలి కార్గో రైలును వాల్తేర్ డీఆర్​ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

మెుదటగా సింహాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి నైరుతి రైల్వేలోని తొండిబావి స్టేషన్​కి ఈ రైలు ద్వారా.. 4 వేల టన్నుల ఫ్లైయాష్ రవాణా చేశారు. రైలు ద్వారా పూర్తిగా కంటైనర్లలలో ఫ్లైయాష్​ తరలింపు వల్ల పర్యావరణానికి విఘాతం కలగకుండా చేయగలిగారు.

ఇదీ చదవండి: విశాఖలో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.