ETV Bharat / state

''నేవీ బేస్​కు మొదటి దశ భూసేకరణ పూర్తి''

విశాఖ జిల్లా రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో సుమారు 8 వేల ఎకరాలను నేవల్ బేస్ కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే భూసేకరణ పూర్తయిన  4 వేల 385 ఎకరాలను ప్రభుత్వం నావిక దళానికి అప్పగించిందని విశాఖ సంయుక్త కలెక్టర్ నేవీ అధికారులకు తెలిపారు.

author img

By

Published : Jul 19, 2019, 5:37 AM IST

నేవీ బేస్​కు మొదటి దశ భూసేకరణ పూర్తి : సంయుక్త కలెక్టర్ శివ శంకర్

నేవల్ ఆల్టర్నేట్ ఆపరేటింగ్ బేస్ (ఎన్.ఎ.ఓ.బి) కోసం విశాఖ జిల్లా రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో ప్రభుత్వం మొదటి దశ భూసేకరణ పూర్తి చేసింది. ఈ భూమూల అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ శివ శంకర్... నేవీ అధికారులకు తెలిపారు. 2005లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో 4 వేల 385 ఎకరాల భూమిని మొదటి దశ కింద సేకరించి, నేవీకి అప్పగించామని ఆయన చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నేవీ అధికారులతో భేటీ అయిన సంయుక్త కలెక్టర్... మొత్తంగా ఈ ప్రాజెక్టు నిమిత్తం 8 వేల ఎకరాల భూమిని నేవీకి ప్రభుత్వం కేటాయించిందన్నారు.

నేవల్ ఆల్టర్నేట్ ఆపరేటింగ్ బేస్ (ఎన్.ఎ.ఓ.బి) కోసం విశాఖ జిల్లా రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో ప్రభుత్వం మొదటి దశ భూసేకరణ పూర్తి చేసింది. ఈ భూమూల అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ శివ శంకర్... నేవీ అధికారులకు తెలిపారు. 2005లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో 4 వేల 385 ఎకరాల భూమిని మొదటి దశ కింద సేకరించి, నేవీకి అప్పగించామని ఆయన చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నేవీ అధికారులతో భేటీ అయిన సంయుక్త కలెక్టర్... మొత్తంగా ఈ ప్రాజెక్టు నిమిత్తం 8 వేల ఎకరాల భూమిని నేవీకి ప్రభుత్వం కేటాయించిందన్నారు.

ఇదీ చదవండి : పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి: అవంతి

Intro:AP_RJY_59_18_POLICELU_SRAMADANAM_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

పోలీసులే శ్రామికులే రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు ను తొలగించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు


Body:తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో స్థానిక అమలాపురం ప్రధాన రహదారిపై ఒక భారీ వృక్షం నేలకొరిగి రోడ్డు అడ్డంగా పడిపోయింది ఈ రహదారిపై వాహనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది దీంతో కొంత సేపు ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు


Conclusion:సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు చెట్లు తొలగించే వారికోసం ప్రయత్నించిన వారు దొరకకపోవడంతో పోలీసులే గొడ్డలి కత్తులు పట్టుకుని పడిపోయిన చెట్టు ని తొలగించి ప్రయాణికుల సమస్యను తీర్చారు దీంతో పోలీసులు చేసిన పనిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.