ETV Bharat / state

సరుగుడు తోటలో అగ్నిప్రమాదం..30 ఎకరాల్లో పంట నష్టం

author img

By

Published : Apr 11, 2021, 10:16 PM IST

30 ఎకరాల్లో ఉన్న సరుగుడు, నీలగిరి తోటలు అగ్నికి ఆహుతైన ఘటన విశాఖ జిల్లా కొండపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో దాదాపు రూ. 19 లక్షల మేర నష్టం ఏర్పడిందని రైతులు వాపోయారు.

fire accident at vishaka
సరుగుడు తోటలో అగ్నిప్రమాదం
సరుగుడు తోటలో అగ్నిప్రమాదం

విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం కొండపాలెం గ్రామంలో 30 ఎకరాల్లో ఉన్న సరుగుడు, నీలగిరి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.19 లక్షల మేర నష్టం ఏర్పడిందని రైతులు తెలిపారు. కొత్త అమావాస్య పండుగ సందడిలో గ్రామం ఉండగా..ఈ ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండటం, ఎండ తీవ్రత వల్ల ఆర్పే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అగ్నిమాపక శకటాలకు స్థానికులు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో గ్రామానికి చెందిన 20 మంది రైతులు నష్టపోయారు.

సరుగుడు తోటలో అగ్నిప్రమాదం

విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం కొండపాలెం గ్రామంలో 30 ఎకరాల్లో ఉన్న సరుగుడు, నీలగిరి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.19 లక్షల మేర నష్టం ఏర్పడిందని రైతులు తెలిపారు. కొత్త అమావాస్య పండుగ సందడిలో గ్రామం ఉండగా..ఈ ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండటం, ఎండ తీవ్రత వల్ల ఆర్పే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అగ్నిమాపక శకటాలకు స్థానికులు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో గ్రామానికి చెందిన 20 మంది రైతులు నష్టపోయారు.

ఇదీచదవండి

అదోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతకు కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.