ETV Bharat / state

ఆలయ భూముల్లో అక్రమ తవ్వకాలు...అధికారుల విచారణ

author img

By

Published : Jun 28, 2020, 12:48 PM IST

విశాఖ జిల్లా పెంటకోటలోని మల్లికార్జునస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారన్న విషయం పై దేవాదాయశాఖ ఏసీ కె.శాంతాకుమారి విచారణ చేపట్టారు.

endoment ac enquiry
ఆలయ భూముల్లో అక్రమ తవ్వకాలు

దేవస్థానం భూముల్లో అక్రమ౦గా మట్టి తవ్వకాలు చేపట్టిన విషయమై దేవాదాయ శాఖ ఏసీ.కె శాంతా కుమారి విచారణ చేపట్టారు. విశాఖ జిల్లా పాయకరావుపేట సమీపాన పెంట కోటలో మల్లికార్జున స్వామి ఆలయ భూముల్లో... కొన్ని రోజులుగా గ్రావెల్ తవ్వి ట్రాక్టర్ల పై తరలించి విక్రయిస్తున్నారు. ఈ పనులు శివాలయం పూజరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని గ్రామస్థులు దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ జరిపి... గ్రామానికి చెందిన శివాలయం భూములను 14 ఎకరాలుగా గుర్తించారు. ఈ భూములకు వేలం నిర్వహిస్తామని... మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఏసీ తెలిపారు.

దేవస్థానం భూముల్లో అక్రమ౦గా మట్టి తవ్వకాలు చేపట్టిన విషయమై దేవాదాయ శాఖ ఏసీ.కె శాంతా కుమారి విచారణ చేపట్టారు. విశాఖ జిల్లా పాయకరావుపేట సమీపాన పెంట కోటలో మల్లికార్జున స్వామి ఆలయ భూముల్లో... కొన్ని రోజులుగా గ్రావెల్ తవ్వి ట్రాక్టర్ల పై తరలించి విక్రయిస్తున్నారు. ఈ పనులు శివాలయం పూజరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని గ్రామస్థులు దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ జరిపి... గ్రామానికి చెందిన శివాలయం భూములను 14 ఎకరాలుగా గుర్తించారు. ఈ భూములకు వేలం నిర్వహిస్తామని... మట్టి తవ్వకాలకు పాల్పడిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఏసీ తెలిపారు.

ఇవీ చదవండి: ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.