ETV Bharat / state

దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ నగలు స్వాధీనం చేసుకున్న దేవాదాయశాఖ

author img

By

Published : Oct 16, 2020, 6:37 PM IST

విజయదశమి నేపథ్యంలో విశాఖజిల్లా నర్సీపట్నంలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన నగలు, నగదును దేవాదాయశాఖ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

Durgamalleshwara Swamy Temple jewelery taken handover by endowments dept
దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ నగలు స్వాధీనం చేసుకున్న దేవాదాయశాఖ

విజయదశమి నేపథ్యంలో విశాఖజిల్లా నర్సీపట్నంలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన నగలు, నగదును దేవాదాయశాఖ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ పూర్వపు కమిటీ ఆధ్వర్యంలో ఉన్న విలువైన నగలు, నగదు, వెండి తదితర ఆభరణాలను దుర్గా శరన్నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతి ఆధ్వర్యంలో వీటిని స్వాధీనపరుచుకున్నారు. మాస్కులు ధరించిన వారు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వసంత కుమార్, కార్యనిర్వహణాధికారి శర్మ తదితరులు పాల్గొన్నారు.

విజయదశమి నేపథ్యంలో విశాఖజిల్లా నర్సీపట్నంలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన నగలు, నగదును దేవాదాయశాఖ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ పూర్వపు కమిటీ ఆధ్వర్యంలో ఉన్న విలువైన నగలు, నగదు, వెండి తదితర ఆభరణాలను దుర్గా శరన్నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతి ఆధ్వర్యంలో వీటిని స్వాధీనపరుచుకున్నారు. మాస్కులు ధరించిన వారు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వసంత కుమార్, కార్యనిర్వహణాధికారి శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

పశువుల కోసం చెరువు దాటుతూ వ్యక్తి గల్లంతు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.