ETV Bharat / state

డుంబ్రిగుడలో విజృంభిస్తున్న డయేరియా

రక్షిత మంచినీరు లేక విశాఖ మన్యంలో గిరిజనులు అస్వస్థతకు గురవుతున్నారు. పోతంగిలో డయేరియాతో 40 మంది మంచాన పడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆదివాసీలు మొర పెట్టుకుంటున్నారు.

author img

By

Published : May 20, 2019, 3:50 PM IST

డుంబ్రిగుడ మండలానికి డయేరియా తాకిడి
డుంబ్రిగుడలో విజృంభిస్తున్న డయేరియా

విశాఖ మన్యంలో డయేరియా విజృంభిస్తోంది. డుంబ్రిగుడ మండలంలోని పోతంగి గ్రామంలో వాంతులు, విరేచనాలతో 40 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో రక్షిత మంచినీరు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... తరచూ రోగాలు తమను వేధిస్తున్నాయని గిరిజనులు వాపోతున్నారు.

గ్రామంలోని తాగునీటి అవసరాలకు కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకానికి పైకప్పు లేకపోవడంతో నీరంతా కలుషితమవుతోందని గిరిజనులు అంటున్నారు. నీరు నాచు పట్టి తాగేందుకు వీలు లేని విధంగా ఉన్నాయంటున్నారు. అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ నీళ్లే తాగుతున్నామని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

మంచాన పడ్డ గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు పీహెచ్​సీ వైద్యులు చర్యలు చేపట్టారు. గ్రామంలోని వారందరికీ మందులు అందించి.. ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు.

తాగునీటి ఇబ్బందులతో తరచూ రోగాల బారిన పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

డుంబ్రిగుడలో విజృంభిస్తున్న డయేరియా

విశాఖ మన్యంలో డయేరియా విజృంభిస్తోంది. డుంబ్రిగుడ మండలంలోని పోతంగి గ్రామంలో వాంతులు, విరేచనాలతో 40 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో రక్షిత మంచినీరు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... తరచూ రోగాలు తమను వేధిస్తున్నాయని గిరిజనులు వాపోతున్నారు.

గ్రామంలోని తాగునీటి అవసరాలకు కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకానికి పైకప్పు లేకపోవడంతో నీరంతా కలుషితమవుతోందని గిరిజనులు అంటున్నారు. నీరు నాచు పట్టి తాగేందుకు వీలు లేని విధంగా ఉన్నాయంటున్నారు. అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ నీళ్లే తాగుతున్నామని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

మంచాన పడ్డ గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు పీహెచ్​సీ వైద్యులు చర్యలు చేపట్టారు. గ్రామంలోని వారందరికీ మందులు అందించి.. ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు.

తాగునీటి ఇబ్బందులతో తరచూ రోగాల బారిన పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Intro:Ap_Vja_24_19_littel_Boy_told_openan_poll_av_C10
Sai babu_ Vijayawada: 9849803586
యాంకర్ : మీ భవిషత్ నా భరోసా అన్న చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రజలు పట్టం కడతారని చిలక పలుకులతో చిట్టి పొట్టి సర్వే చేశాడు. విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన నహిద్ అనే భాలుడు. తను చదివే పాఠశాలలో ఎన్నికలు పూర్తయిన తర్వాత వివిధ వార్త పేపర్ చదువుతూ తాను ఈ సర్వే ని రూపొందించా నని బాలుడు నహీమ్ తెలిపాడు. 23వ తేదీ వచ్చే ఫలితాలలో గతంలో మ్యాజిక్ దగ్గర కంటే 5 నుంచి 15 సీట్లు అదనంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వస్తాయని ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వైసీపీ 63 నుండి 72 సీట్లు వచ్చే అవకాశం ఉందని...


Body:Ap_Vja_24_19_littel_Boy_told_openan_poll_av_C10


Conclusion:Ap_Vja_24_19_littel_Boy_told_openan_poll_av_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.