పట్టాలు తప్పిన గూడ్స్.. 4 గంటలు ఆలస్యంగా కిరండోల్ పాసింజర్ - 4 hours stalled passenger train at visakhapatnam news update
విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం త్యాడా రైల్వే మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే పాసింజర్ 4 గంటల పాటు నిలిచిపోయింది. రైలు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే స్పందించి వేరే మార్గంలో రైలు మళ్లించడం వల్ల రైలు ముందుకు కదిలింది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలుకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ మార్గంలో ఇతర గూడ్స్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
త్యాడా రైల్వే మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్
By
Published : Feb 2, 2020, 10:28 AM IST
గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో నిలిచిపోయిన కిరండోల్ పాసింజర్