ETV Bharat / state

ఏఓబీలో ఈ నెల 21న బంద్​.. పిలుపునిచ్చిన మావోయిస్టులు

author img

By

Published : Dec 19, 2020, 10:12 PM IST

Updated : Dec 20, 2020, 1:31 AM IST

ఏఓబీ బంద్​కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నెల 12న జరిగిన ఎన్​కౌంటర్​ను వ్యతిరేకిస్తూ.. మావోయిస్టులు ఆడియో టేప్​ను విడుదల చేశారు.

ఏఓబీలో ఈ నెల 21న బంద్​
ఏఓబీలో ఈ నెల 21న బంద్​

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగవరం గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగిన ఎన్​కౌంటర్​ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ ఈనెల 21వ తేదీన ఏవోబీ ప్రాంతంలో బంద్​కు పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్​జెడ్​సీ అధికార ప్రతినిధి కైలాసం పేరిట లేఖ, ఆడియో టేప్​ను విడుదల చేశారు. నిద్రలో ఉన్న మావోయిస్టులపై దారుణంగా కాల్పులు జరిపి హతమార్చారని ఆడియోలో పేర్కొన్నారు. రాత్రి రెండుగంటల సమయంలో ఒడిశా పోలీసులు కామ్రేడ్స్​ను చుట్టుముట్టి పట్టుకుని కాల్చి చంపారన్నారు. పార్టీ సభ్యులతో పాటు అదే గ్రామానికి చెందిన చిన్న పసిపాపను కూడా చంపారని తెలిపారు.

ఈ సంఘటనను దారుణంగా గా ఖండిస్తూ ఈనెల 21వ తేదీన ఏవోబీ ప్రాంతమంతటా బంద్​కు పిలుపునివ్వనున్నట్లు లేఖ విడుదల చేశారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగవరం గ్రామంలో ఈ నెల 12వ తేదీన జరిగిన ఎన్​కౌంటర్​ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ ఈనెల 21వ తేదీన ఏవోబీ ప్రాంతంలో బంద్​కు పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్​జెడ్​సీ అధికార ప్రతినిధి కైలాసం పేరిట లేఖ, ఆడియో టేప్​ను విడుదల చేశారు. నిద్రలో ఉన్న మావోయిస్టులపై దారుణంగా కాల్పులు జరిపి హతమార్చారని ఆడియోలో పేర్కొన్నారు. రాత్రి రెండుగంటల సమయంలో ఒడిశా పోలీసులు కామ్రేడ్స్​ను చుట్టుముట్టి పట్టుకుని కాల్చి చంపారన్నారు. పార్టీ సభ్యులతో పాటు అదే గ్రామానికి చెందిన చిన్న పసిపాపను కూడా చంపారని తెలిపారు.

ఈ సంఘటనను దారుణంగా గా ఖండిస్తూ ఈనెల 21వ తేదీన ఏవోబీ ప్రాంతమంతటా బంద్​కు పిలుపునివ్వనున్నట్లు లేఖ విడుదల చేశారు.

ఇదీ చదవండి: వాటర్ హీటర్​తో కాదు.. తల్లే పిల్లలను చంపేసి.. చనిపోయింది​!

Last Updated : Dec 20, 2020, 1:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.