ETV Bharat / state

1010 కిలోల గంజాయి స్వాధీనం.. విలువ రూ. కోటి పైనే!

author img

By

Published : Jun 9, 2020, 7:02 PM IST

విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలు విలువ చేసే గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

crore rupees worth of  possession of marijuana
కోటి రూపాయిల విలువైన గంజాయి స్వాధీనం

ఆంధ్రా ఒడిశా సరిహద్దులో 1010 కిలోల గంజాయి పట్టుబడింది. ఆ సరకు విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశాలోని కటక్​కు చెందిన అజయ్ కుమార్ దూబే.. ఏఓబీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు.

ఆ సరకును.. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పంచాయతీకి చెందిన పాంగి రాజులు.. ఓ లారీలో ఎక్కించి మైదాన ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశాడని చెప్పారు. కొయ్యూరు మండలం డౌనూరు వద్ద లారీని ఆపి.. గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. లారీని సీజ్ చేసినట్టు చెప్పారు.

ఆంధ్రా ఒడిశా సరిహద్దులో 1010 కిలోల గంజాయి పట్టుబడింది. ఆ సరకు విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశాలోని కటక్​కు చెందిన అజయ్ కుమార్ దూబే.. ఏఓబీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు.

ఆ సరకును.. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పంచాయతీకి చెందిన పాంగి రాజులు.. ఓ లారీలో ఎక్కించి మైదాన ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశాడని చెప్పారు. కొయ్యూరు మండలం డౌనూరు వద్ద లారీని ఆపి.. గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. లారీని సీజ్ చేసినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

అమరావతిని జగన్​ ఖూనీ చేశారు: వాసుపల్లి గణేష్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.