ETV Bharat / state

Black Gold: బ్లాక్ గోల్డ్ కంపెనీ తెరవాలని సీఐటీయూ నిరసన

author img

By

Published : May 30, 2021, 6:43 AM IST

విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్​లోని బ్లాక్ గోల్డ్ ప్రొఫైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని వెంటనే తెరవాలని సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. జీతాలు పెంచాలని కార్మికులు అడిగితే సంస్థను మూసివేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

protest
సీఐటీయూ నాయకుల నిరసన

విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్​లోని బ్లాక్ గోల్డ్ కంపెనీని వెంటనే తెరవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. కంపెనీ ఎదుట నిరసన చేశారు. ఈ నెల ఒకటో తేదీన సంస్థను మూసివేసిన కారణంగా.. కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ గోల్డ్ యాజమాన్యం, స్టీల్ ఎక్స్చేంజ్ కంపెనీ కలిసి కార్మికులకు ద్రోహం చేసేలా ఉన్నాయని సీఐటీయూ నాయకుడు రాంబాబు అన్నారు.

20 ఏళ్లుగా 120 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని… దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారు జీతాలు పెంచాలని అడిగినందుకు కంపెనీని మూసివేయటం దారుణమన్నారు. కార్మిక శాఖ కమిషనర్…​ వెంటనే కంపెనీని తెరిపించాలని.. లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డి.రమణ, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్​లోని బ్లాక్ గోల్డ్ కంపెనీని వెంటనే తెరవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. కంపెనీ ఎదుట నిరసన చేశారు. ఈ నెల ఒకటో తేదీన సంస్థను మూసివేసిన కారణంగా.. కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ గోల్డ్ యాజమాన్యం, స్టీల్ ఎక్స్చేంజ్ కంపెనీ కలిసి కార్మికులకు ద్రోహం చేసేలా ఉన్నాయని సీఐటీయూ నాయకుడు రాంబాబు అన్నారు.

20 ఏళ్లుగా 120 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని… దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారు జీతాలు పెంచాలని అడిగినందుకు కంపెనీని మూసివేయటం దారుణమన్నారు. కార్మిక శాఖ కమిషనర్…​ వెంటనే కంపెనీని తెరిపించాలని.. లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డి.రమణ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'వ్యాక్సిన్ కోసం నగదు తీసుకునేవారిపై కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.