విశాఖ జిల్లాలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. నర్సీపట్నం డివిజన్లోని పలు గ్రామాల్లో పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి పొలాలు ఎన్ని రోజుల కిందట కోశారు? ఎన్ని రోజులపాటు వర్షపు నీటిలో మునిగి ఉన్నాయి? తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని బృంద సభ్యులు స్పష్టం చేశారు.
ఇదీచదవండి