ETV Bharat / state

కబ్జా చెర నుంచి విలువైన దేవాదాయ భూములు స్వాధీనం

విశాఖపట్నం జిల్లా భీమిలిలోని శివకేశవ దేవస్థానానికి చెందిన గొల్లకుమ్మరిపాలెంలో సర్వే నంబరు 62/3లోని 2.21 ఎకరాల స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్​లో 6 కోట్ల రూపాయలు పలుకుతోంది. విశాఖ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కె.శాంతి... రెవెన్యూ సిబ్బంది సాయంతో ఆక్రమణలను తొలగించారు.

author img

By

Published : Sep 19, 2020, 6:41 PM IST

bheemunipatnam
bheemunipatnam

విశాఖ జిల్లా భీమునిపట్నంలో శివకేశవస్వామి దేవస్థానానికి చెందిన గొల్లకుమ్మరిపాలెంలో సర్వే నంబరు 62/3లోని 2.21 ఎకరాల స్థలాన్ని దేవాదాయ శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.6 కోట్ల విలువైన ఈ భూమిని... గుర్తు తెలియని వ్యక్తులు చదును చేసేందుకు ప్రయత్నించారు. విశాఖ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతి అప్రమత్తమై...రెవెన్యూ అధికారుల సాయంతో భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న పాకలను తొలగించి... హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

ఉద్రిక్తతల నడుమ

ఆక్రమణల తొలగింపు కోసం ముందుగా పోలీసులను బందోబస్తు కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి... రెవెన్యూ సిబ్బంది సాయంతో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లారు. ఓ దశలో ఆక్రమణదారులు ఆర్తనాదాలతో అసిస్టెంట్ కమిషనర్​తో పాటు సిబ్బందిని చుట్టుముట్టారు. మహిళలు ప్రొక్లెయినర్​కు అడ్డుపడ్డారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు సహాయం కోరినా.. పోలీసులు సకాలంలో స్పందించలేదని అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. భూముల కబ్జా వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలోనే తేలుస్తామన్నారు.

చివరకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణదారులను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

విశాఖ జిల్లా భీమునిపట్నంలో శివకేశవస్వామి దేవస్థానానికి చెందిన గొల్లకుమ్మరిపాలెంలో సర్వే నంబరు 62/3లోని 2.21 ఎకరాల స్థలాన్ని దేవాదాయ శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.6 కోట్ల విలువైన ఈ భూమిని... గుర్తు తెలియని వ్యక్తులు చదును చేసేందుకు ప్రయత్నించారు. విశాఖ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతి అప్రమత్తమై...రెవెన్యూ అధికారుల సాయంతో భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న పాకలను తొలగించి... హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

ఉద్రిక్తతల నడుమ

ఆక్రమణల తొలగింపు కోసం ముందుగా పోలీసులను బందోబస్తు కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి... రెవెన్యూ సిబ్బంది సాయంతో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లారు. ఓ దశలో ఆక్రమణదారులు ఆర్తనాదాలతో అసిస్టెంట్ కమిషనర్​తో పాటు సిబ్బందిని చుట్టుముట్టారు. మహిళలు ప్రొక్లెయినర్​కు అడ్డుపడ్డారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు సహాయం కోరినా.. పోలీసులు సకాలంలో స్పందించలేదని అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. భూముల కబ్జా వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలోనే తేలుస్తామన్నారు.

చివరకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణదారులను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.