ETV Bharat / state

'వారికి సహకరించొద్దు.. జీవితాలు నాశనం చేసుకోవద్దు'

author img

By

Published : Aug 9, 2020, 3:57 PM IST

ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల సంఖ్య, ప్రాబ‌ల్యం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింద‌ని న‌ర్సీప‌ట్నం ఏఎస్‌పీ తుహీర్ సిన్హా తెలిపారు. క‌మ్యూనిటీ పోలింగ్‌లో భాగంగా ఆయ‌న కొయ్యూరు మండ‌ల‌ంలోని మావోయిస్టు ప్రాబ‌ల్య ప్రాంతం బూద‌రాళ్ల‌లో గ్రామాన్ని సంద‌ర్శించారు.

'మావోయిస్టులకు సహకరించి.. జీవితాలు నాశనం చేసుకోవద్దు'
'మావోయిస్టులకు సహకరించి.. జీవితాలు నాశనం చేసుకోవద్దు'

గతంలో మాదిరిగా గిరిజ‌నుల నుంచి మావోయిస్టుల‌కు స‌హాయం అంద‌డం లేదని ఏఎస్‌పీ తుహీర్ సిన్హా చెప్పారు. అంద‌రిలో చైత‌న్యం వచ్చిన కారణంగా.. గిరిజనులు మావోయిజం వైపు వెళ్ల‌డం లేద‌ని అన్నారు. మావోయిస్టుల‌కు స‌హ‌క‌రించి ఎవ్వ‌రూ జీవితాల‌ను నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని ఏఎస్‌పీ సూచించారు.

మొబైల్ సంకేతాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని గ్రామ‌స్థులు ఏఎస్‌పీకి విన్న‌వించారు. అనంత‌రం బూద‌రాళ్లు - పెద‌వ‌ల‌స ర‌హ‌దారిని ఆయ‌న ప‌రిశీలించారు. గ్రామంలో స‌మ‌స్య‌ల‌ను ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని ఏఎస్‌పీ చెప్పారు. అనంత‌రం స్థానిక యువ‌కుల‌కు వాలీబాల్ కిట్ల‌ు పంపిణీ చేశారు.

గతంలో మాదిరిగా గిరిజ‌నుల నుంచి మావోయిస్టుల‌కు స‌హాయం అంద‌డం లేదని ఏఎస్‌పీ తుహీర్ సిన్హా చెప్పారు. అంద‌రిలో చైత‌న్యం వచ్చిన కారణంగా.. గిరిజనులు మావోయిజం వైపు వెళ్ల‌డం లేద‌ని అన్నారు. మావోయిస్టుల‌కు స‌హ‌క‌రించి ఎవ్వ‌రూ జీవితాల‌ను నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని ఏఎస్‌పీ సూచించారు.

మొబైల్ సంకేతాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని గ్రామ‌స్థులు ఏఎస్‌పీకి విన్న‌వించారు. అనంత‌రం బూద‌రాళ్లు - పెద‌వ‌ల‌స ర‌హ‌దారిని ఆయ‌న ప‌రిశీలించారు. గ్రామంలో స‌మ‌స్య‌ల‌ను ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని ఏఎస్‌పీ చెప్పారు. అనంత‌రం స్థానిక యువ‌కుల‌కు వాలీబాల్ కిట్ల‌ు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.