ETV Bharat / state

అక్రమాల 'తీగ'

దేశవ్యాప్తంగా విద్యుత్తు సంబంధ సంస్కరణల్లో దీటుగా నిలుస్తూ వచ్చిన ఈపీడీసీఎల్‌పై ఇప్పుడు మాయని మచ్చపడింది.  2016లో జరిగిన పనుల్లో, కవర్డ్‌ కండక్టర్ల టెండర్ల కొనుగోళ్లలో రూ.131 కోట్ల అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

author img

By

Published : Feb 20, 2019, 12:48 AM IST

Updated : Feb 20, 2019, 10:58 AM IST

విద్యుత్ ఆధికారుల అవినీతి

విద్యుత్తు నిఘా విభాగం అధికారుల నివేదిక.. తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)లోని అవినీతి అధికారులకు చెమటలు పట్టిస్తోంది. కవర్డ్ కండక్టర్ల(పూత పూసిన విద్యుత్తు తీగలు) కొనుగోలు పేరుతో దాదాపు 131 కోట్ల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి సమర్పించడం సంచలనాలు స్పష్టిస్తోంది. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ సీఎండీ దొరతో రాజీనామా చేయించి ప్రభుత్వం నష్టనివారణ చర్యలను చేపట్టింది.

ఏపీఈపీడీసీఎల్​లో అవినీతి బాగోతం

కుంభకోణం చరిత్ర

undefined

విద్యుత్తు సరఫరాకు ఆటంకాలు లేకుండా కవర్డ్ కండక్టర్ల కొనుగోలుకు ప్రభుత్వానికి ఓ మధ్యవర్తి సూచించారు. విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాల్సి ఉన్నందున ధరపై స్పష్టత ఇవ్వకుండానే 2016లో టెండర్లు పిలిచారు. ఆ దళారి ముందే చేసుకున్న చీకటి ఒప్పందం ప్రకారం... బిడ్ వేసే కంపెనీకి అనుకూలంగా నియమావళి రూపొందించారు. రేచెమ్ ఆర్పీజి,సాయి ఎలక్ట్రికల్ ఎంటర్ ప్రైజెస్తో పాటు మరొక సంస్థ బిడ్​లుదాఖలు చేశారు. ఈ రెండు కంపెనీలు ఒకరివేనని విజిలెన్స్ నిర్ధారించింది. టెండరులో ప్రథమ ధరావతు రుసుము నిధులను కూడా ఒకే ఖాతా నుంచి పంపించారు. రేచెమ్ సంస్థకే టెండర్ దక్కింది. ఎలాంటి అనుభవం లేని ఈ సంస్థకు పనులను కట్టబెట్టారు. గ్లోబల్ టెండర్ ప్రకటన ఇవ్వకుండా స్ధానికంగా ప్రకటనలు ఇచ్చి ధరను నిర్ణయించకుండా టెండర్ కట్టబెట్టడంలో ఈ అధికార్లంతా కీలకంగా వ్యవహరించారనేది అభియోగం.

గుజరాత్ నుంచి తెచ్చి.. నిధులు బొక్కి

మొత్తం 3414 కిలో మీటర్ల పొడవైన తీగల్ని సరఫరా చేసిన రేచెమ్ సంస్థ 178 కోట్ల రూపాయల బిల్లులను సమర్పించింది. 59 కోట్ల విలువచేసేతీగలకు 178 కోట్ల రూపాయల బిల్లులను సమర్పించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 119 కోట్లు అదనంగా చెల్లించేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఈ వైర్లను గుజరాత్ నుంచి తీసుకువచ్చారని విదేశాల నుంచి తేలేదని నిగ్గు తేల్చారు.

దొరది కీలక పాత్ర

ఎస్పీడీసీఎల్​లో పని చేసినప్పుడు దొర ఈ మాదిరిగానే టెండర్లను ఆమోదింపజేసి, ఈపీడీసీఎల్కి సీఎండీగా వచ్చిన తర్వాత అదే పద్దతిలో రేచెమ్ సంస్ధకు దాదాపు 400 కిమీ పొడవునవైర్లువేసేందుకు అనుమతించారు. ఇందులోనూ దాదాపు 12 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని తేలింది. గతేడాది జులైలో విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించగా... దీనిపై అంతర్గతంగా తీవ్ర చర్చ జరిగింది. అప్పటి నుంచి ఒత్తిళ్లు రాగా.... శుక్రవారం తన పదవికి రాజనామా చేశారు హెచ్.వై. దొర. వెంటనే దానిని ఆమోందించి విచారణ కొనసాగేట్టుగా ప్రభుత్వం ఆదేశించింది.

undefined

విద్యుత్తు నిఘా విభాగం అధికారుల నివేదిక.. తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)లోని అవినీతి అధికారులకు చెమటలు పట్టిస్తోంది. కవర్డ్ కండక్టర్ల(పూత పూసిన విద్యుత్తు తీగలు) కొనుగోలు పేరుతో దాదాపు 131 కోట్ల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి సమర్పించడం సంచలనాలు స్పష్టిస్తోంది. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ సీఎండీ దొరతో రాజీనామా చేయించి ప్రభుత్వం నష్టనివారణ చర్యలను చేపట్టింది.

ఏపీఈపీడీసీఎల్​లో అవినీతి బాగోతం

కుంభకోణం చరిత్ర

undefined

విద్యుత్తు సరఫరాకు ఆటంకాలు లేకుండా కవర్డ్ కండక్టర్ల కొనుగోలుకు ప్రభుత్వానికి ఓ మధ్యవర్తి సూచించారు. విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాల్సి ఉన్నందున ధరపై స్పష్టత ఇవ్వకుండానే 2016లో టెండర్లు పిలిచారు. ఆ దళారి ముందే చేసుకున్న చీకటి ఒప్పందం ప్రకారం... బిడ్ వేసే కంపెనీకి అనుకూలంగా నియమావళి రూపొందించారు. రేచెమ్ ఆర్పీజి,సాయి ఎలక్ట్రికల్ ఎంటర్ ప్రైజెస్తో పాటు మరొక సంస్థ బిడ్​లుదాఖలు చేశారు. ఈ రెండు కంపెనీలు ఒకరివేనని విజిలెన్స్ నిర్ధారించింది. టెండరులో ప్రథమ ధరావతు రుసుము నిధులను కూడా ఒకే ఖాతా నుంచి పంపించారు. రేచెమ్ సంస్థకే టెండర్ దక్కింది. ఎలాంటి అనుభవం లేని ఈ సంస్థకు పనులను కట్టబెట్టారు. గ్లోబల్ టెండర్ ప్రకటన ఇవ్వకుండా స్ధానికంగా ప్రకటనలు ఇచ్చి ధరను నిర్ణయించకుండా టెండర్ కట్టబెట్టడంలో ఈ అధికార్లంతా కీలకంగా వ్యవహరించారనేది అభియోగం.

గుజరాత్ నుంచి తెచ్చి.. నిధులు బొక్కి

మొత్తం 3414 కిలో మీటర్ల పొడవైన తీగల్ని సరఫరా చేసిన రేచెమ్ సంస్థ 178 కోట్ల రూపాయల బిల్లులను సమర్పించింది. 59 కోట్ల విలువచేసేతీగలకు 178 కోట్ల రూపాయల బిల్లులను సమర్పించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 119 కోట్లు అదనంగా చెల్లించేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఈ వైర్లను గుజరాత్ నుంచి తీసుకువచ్చారని విదేశాల నుంచి తేలేదని నిగ్గు తేల్చారు.

దొరది కీలక పాత్ర

ఎస్పీడీసీఎల్​లో పని చేసినప్పుడు దొర ఈ మాదిరిగానే టెండర్లను ఆమోదింపజేసి, ఈపీడీసీఎల్కి సీఎండీగా వచ్చిన తర్వాత అదే పద్దతిలో రేచెమ్ సంస్ధకు దాదాపు 400 కిమీ పొడవునవైర్లువేసేందుకు అనుమతించారు. ఇందులోనూ దాదాపు 12 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని తేలింది. గతేడాది జులైలో విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించగా... దీనిపై అంతర్గతంగా తీవ్ర చర్చ జరిగింది. అప్పటి నుంచి ఒత్తిళ్లు రాగా.... శుక్రవారం తన పదవికి రాజనామా చేశారు హెచ్.వై. దొర. వెంటనే దానిని ఆమోందించి విచారణ కొనసాగేట్టుగా ప్రభుత్వం ఆదేశించింది.

undefined
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:మైనార్టీ సీను ఆదుకునే ప్రభుత్వం వారి కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు గుంటూరు జిల్లా చుండూరు మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మోదుగుల శంకుస్థాపన చేసి మంత్రి మాట్లాడుతూ ఈరోజు నాలుగున్నర సంవత్సరాలలో రెండు వేల కోట్లు ఖర్చు చేశారు గత ప్రభుత్వంలో 200 కోట్లు ఖర్చు చేశారని ముస్లిమ్స్ కి హజ్ యాత్ర దానికి ప్రభుత్వ పంపిస్తుందని రాబోయే రోజుల్లో మైనార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉండాలని మంత్రి కోరారు


Conclusion:బైట్ నక్కా ఆనందబాబు సాంఘిక అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
Last Updated : Feb 20, 2019, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.