ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న అనకాపల్లి నూకాలమ్మ దర్శన భాగ్యం.. ఇప్పట్లో భక్తులకు లభించే అవకాశం కనిపించడం లేదు. లాక్డౌన్ సడలింపుతో ఈ నెల 8 నుంచి దేవాలయం తెరవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కానీ... అనకాపల్లి పట్టణంలో కరోనా కేసులు పెరగడం... అమ్మవారి దేవస్థానం కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉండటమే ఇందుకు కారణమైంది. తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నామని.. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు.
ఇదీ చదవండి: