ETV Bharat / state

'వ్యక్తిగతంగా... న్యాయస్థానం తీర్పులను విభేదిస్తున్నా'

ప్రజాస్వామ్యంలో చట్టాలను చేసే పని ప్రభుత్వం చేస్తుందని, ప్రజాహిత కార్యక్రమాల అమలుపై పూర్తిగా దృష్టి పెడుతోందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ అన్నారు. వివిధ అంశాల్లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను తాను విభేదిస్తున్నాని చెప్పారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని తెలిపారు.

author img

By

Published : May 24, 2020, 2:06 PM IST

anakapalle mla gudivada amarnadh says his opinion about court verdict
న్యాయస్థానాల తీర్పుపై తన అభిప్రాయం తెలిపిన అనకాపల్లి ఎమ్మెల్యే

ఇటీవల వివిధ అంశాలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను తాను వ్యక్తిగతంగా విభేదిస్తానని విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ చెప్పారు. ప్రజాస్వామ్యంలో సజావుగా సాగాల్సిన పనులకు అటంకం ఏర్పడుతోందన్నది తన అభిప్రాయమన్నారు. రాష్ట్రంలో తెదేపా నేతలు పూర్తిగా అసంబద్ధ వ్యాఖ్యలతో తప్పుదోవ పట్టించే పనిలో ఉన్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి వైయస్​ జగన్​పై ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించిన రోజు ఇదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పాలన సాగుతోందనీ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం పైగా హామీలను అమలు చేశారు. సంక్షేమం, అభివృధ్ది దిశగా జగన్​ పాలన నడుస్తోందని చెప్పారు.

ఇటీవల వివిధ అంశాలపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను తాను వ్యక్తిగతంగా విభేదిస్తానని విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​ చెప్పారు. ప్రజాస్వామ్యంలో సజావుగా సాగాల్సిన పనులకు అటంకం ఏర్పడుతోందన్నది తన అభిప్రాయమన్నారు. రాష్ట్రంలో తెదేపా నేతలు పూర్తిగా అసంబద్ధ వ్యాఖ్యలతో తప్పుదోవ పట్టించే పనిలో ఉన్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి వైయస్​ జగన్​పై ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించిన రోజు ఇదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పాలన సాగుతోందనీ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం పైగా హామీలను అమలు చేశారు. సంక్షేమం, అభివృధ్ది దిశగా జగన్​ పాలన నడుస్తోందని చెప్పారు.

ఇదీ చదవండి:

రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.