ETV Bharat / state

మరిన్ని హంగులు జోడించి.. రైల్వే ఆసుపత్రిలో రోబో సేవలు

author img

By

Published : Sep 30, 2020, 12:06 PM IST

వాల్తేర్ లోకో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ ఎం పాత్రో అలోచన నుంచి రూపుదిద్దుకున్న రోబోను తూర్పు కోస్తా రైల్వే ప్రధాన ఆసుపత్రి భువనేశ్వర్ లో కొవిడ్ వార్డులో వినియోగించనున్నారు. అయితే వీటికి మరిన్ని ఫీచర్లు జత చేసి మెడికల్ రోబోను సిద్దం చేశారు.

రోబో సేవలు
రోబో సేవలు
రైల్వే ఆసుపత్రిలో రోబో సేవలు
కొవిడ్ వార్డులో సిబ్బంది అవసరం లేకుండా పనిచేసే మెడి రోబోను రూపొందించి.. విశాఖలోని రైల్వే ఆసుపత్రికి అందించిన పాత్రో.. మరిన్ని ఫీచర్లు ఏర్పాటు చేసి ఆధునీకరించారు. కొవిడ్ వార్డులోకి భౌతికంగా మనిషి వెళ్లే అవసరం లేకుండా బాధితులకు ఆహారం, మందులు ఈ రోబో ద్వారా అందించవచ్చని వాల్తేర్ లోకో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ ఎం పాత్రో తెలిపారు. దీనిని తూర్పు కోస్తా రైల్వే ప్రధాన ఆసుపత్రి భువనేశ్వర్​లో కొవిడ్ వార్డులో వినియోగించనున్నారు.

ఇందులో అదనంగా కొవిడ్ బాధితుని ఉష్టోగ్రత కూడా చూసేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి 360 డిగ్రీల కెమెరాను అమర్చడం ద్వారా కొవిడ్ బాధితుని పరిస్ధితిని చాలా దగ్గరగా అంచనా వేయడానికి, వైద్యుడు నేరుగా సంభాషించడానికి అనువుగా ఉంటుందని తెలిపారు. మరోవైపు ఈ మెడి రోబోను మొబైల్ నుంచి రిమోట్ లో ఆపరేట్ చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ రోబోలో మరో కొత్త ఫీచర్ కూడా అందుబాటులో ఉంచారు. నర్సింగ్ స్టాఫ్, కోవిడ్ వార్డుల్లో సేవలందించే సిబ్బంది తమ వస్తు సామగ్రిని యూవి లైట్ ద్వారా స్టెరిలైజేషన్ చేసేందుకు ప్రత్యేకంగా ఛాంబర్లు ఏర్పాటు చేశారు.

కొవిడ్ వార్డులో వినియోగించేందుకు వీలుగా చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గీతం దత్తా ఆదేశాలతో సిద్దం చేసినట్టు వివరించారు. గతంలో రూపొందించిన రోబోకు రైల్వే మంత్రి పియూష్ గోయెల్ నుంచి ప్రశంసలు లభించినట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి...

డాక్టర్ శ్యామల మృతి కేసును సమగ్రంగా విచారిస్తున్నాం : ఎస్పీ

రైల్వే ఆసుపత్రిలో రోబో సేవలు
కొవిడ్ వార్డులో సిబ్బంది అవసరం లేకుండా పనిచేసే మెడి రోబోను రూపొందించి.. విశాఖలోని రైల్వే ఆసుపత్రికి అందించిన పాత్రో.. మరిన్ని ఫీచర్లు ఏర్పాటు చేసి ఆధునీకరించారు. కొవిడ్ వార్డులోకి భౌతికంగా మనిషి వెళ్లే అవసరం లేకుండా బాధితులకు ఆహారం, మందులు ఈ రోబో ద్వారా అందించవచ్చని వాల్తేర్ లోకో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ ఎం పాత్రో తెలిపారు. దీనిని తూర్పు కోస్తా రైల్వే ప్రధాన ఆసుపత్రి భువనేశ్వర్​లో కొవిడ్ వార్డులో వినియోగించనున్నారు.

ఇందులో అదనంగా కొవిడ్ బాధితుని ఉష్టోగ్రత కూడా చూసేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి 360 డిగ్రీల కెమెరాను అమర్చడం ద్వారా కొవిడ్ బాధితుని పరిస్ధితిని చాలా దగ్గరగా అంచనా వేయడానికి, వైద్యుడు నేరుగా సంభాషించడానికి అనువుగా ఉంటుందని తెలిపారు. మరోవైపు ఈ మెడి రోబోను మొబైల్ నుంచి రిమోట్ లో ఆపరేట్ చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ రోబోలో మరో కొత్త ఫీచర్ కూడా అందుబాటులో ఉంచారు. నర్సింగ్ స్టాఫ్, కోవిడ్ వార్డుల్లో సేవలందించే సిబ్బంది తమ వస్తు సామగ్రిని యూవి లైట్ ద్వారా స్టెరిలైజేషన్ చేసేందుకు ప్రత్యేకంగా ఛాంబర్లు ఏర్పాటు చేశారు.

కొవిడ్ వార్డులో వినియోగించేందుకు వీలుగా చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గీతం దత్తా ఆదేశాలతో సిద్దం చేసినట్టు వివరించారు. గతంలో రూపొందించిన రోబోకు రైల్వే మంత్రి పియూష్ గోయెల్ నుంచి ప్రశంసలు లభించినట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి...

డాక్టర్ శ్యామల మృతి కేసును సమగ్రంగా విచారిస్తున్నాం : ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.