ETV Bharat / state

పుష్కరం తర్వాత.. కుటుంబసభ్యుల చెంతకు!

మతిస్థిమితం కోల్పోయిన బామ్మ... 12 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఎక్కడికెళ్లిందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. 8 ఏళ్ల పాటు.. వెతికీ వెతికీ కుటుంబసభ్యలూ ఆమెపై ఆశలు వదులుకున్నారు. కానీ.. తప్పిపోయిన పుష్కరం తర్వాత ఆ వృద్ధురాలి రాత మారింది. తెలంగాణలో తప్పిపోయి.. ఆంధ్రాకు చేరిన ఆమెను.. ఓ స్వచ్ఛంద సేవా కార్యకర్త.. సామాజిక మాధ్యమాల సహాయంతో.. అయినవాళ్లచెంతకు చేర్చారు.

author img

By

Published : Jun 3, 2019, 5:15 PM IST

ఫేస్​బుక్ కలిపింది
ఫేస్​బుక్ కలిపింది

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ నగరంలోని ఎస్​ఆర్​ఆర్​తోట ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల ఉప్పమ్మ.. మతిస్థిమితం సరిగ్గా లేక 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఎనిమిదేళ్ల పాటు కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతికినా జాడ తెలియలేదు. అప్పటి నుంచి భిక్షాటన చేస్తూ ఎక్కడెక్కడో తిరిగిన ఆమె ఇటీవలే కృష్ణా జిల్లా నందిగామ చేరారు. కొన్నాళ్ల నుంచి స్థానిక బస్టాండ్‌లో ఉంటున్నారు.

చలించిపోయి... చేరదీసింది

ఉప్పమ్మ దయనీయ స్థితిని చూసి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటకు చెందిన అమ్మ అనాథ, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు శ్రీదేవి చలించిపోయారు. విజయవాడ వైపు బస్సులో వెళ్తుండగా ఉప్పమ్మను చూసి వెంటనే బస్సు దిగి ఆమె జుట్టు తీయించి, స్నానం చేయించి దుస్తులు మార్పించారు. అనంతరం నందిగామ మండలం మాగల్లు గ్రామంలోని ఖాశిం అండ్‌ ఖాశిం వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు.

ఫేస్​బుక్ ద్వారా...

ఉప్పమ్మ చిత్రాలను శ్రీదేవి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిని గుర్తించిన కుటుంబసభ్యులు తమకు అప్పగించాలని శ్రీదేవిని కోరారు. అనంతరం... ఆశ్రమ నిర్వాహకులు ఆ వృద్ధురాలిని తీసుకుని నందిగామ వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు కార్యాలయానికి శ్రీదేవి చేరుకున్నారు. ఆయన లేనందున స్థానిక నేతల సహకారంతో ఆమెను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో ఆ వృద్ధురాలిని వరంగల్‌ తీసుకెళ్లి వరంగల్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సమక్షంలో కుటుంబీకులకు అప్పగించారు. పుష్కరం తర్వాత తమ చెంతకు చేరిన పెద్ద దిక్కును చూసి.. ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైంది. ఉప్పమ్మను గుర్తించి, చేరదీసి తమకు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది.

ఫేస్​బుక్ కలిపింది

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ నగరంలోని ఎస్​ఆర్​ఆర్​తోట ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల ఉప్పమ్మ.. మతిస్థిమితం సరిగ్గా లేక 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఎనిమిదేళ్ల పాటు కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతికినా జాడ తెలియలేదు. అప్పటి నుంచి భిక్షాటన చేస్తూ ఎక్కడెక్కడో తిరిగిన ఆమె ఇటీవలే కృష్ణా జిల్లా నందిగామ చేరారు. కొన్నాళ్ల నుంచి స్థానిక బస్టాండ్‌లో ఉంటున్నారు.

చలించిపోయి... చేరదీసింది

ఉప్పమ్మ దయనీయ స్థితిని చూసి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటకు చెందిన అమ్మ అనాథ, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు శ్రీదేవి చలించిపోయారు. విజయవాడ వైపు బస్సులో వెళ్తుండగా ఉప్పమ్మను చూసి వెంటనే బస్సు దిగి ఆమె జుట్టు తీయించి, స్నానం చేయించి దుస్తులు మార్పించారు. అనంతరం నందిగామ మండలం మాగల్లు గ్రామంలోని ఖాశిం అండ్‌ ఖాశిం వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు.

ఫేస్​బుక్ ద్వారా...

ఉప్పమ్మ చిత్రాలను శ్రీదేవి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిని గుర్తించిన కుటుంబసభ్యులు తమకు అప్పగించాలని శ్రీదేవిని కోరారు. అనంతరం... ఆశ్రమ నిర్వాహకులు ఆ వృద్ధురాలిని తీసుకుని నందిగామ వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు కార్యాలయానికి శ్రీదేవి చేరుకున్నారు. ఆయన లేనందున స్థానిక నేతల సహకారంతో ఆమెను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో ఆ వృద్ధురాలిని వరంగల్‌ తీసుకెళ్లి వరంగల్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సమక్షంలో కుటుంబీకులకు అప్పగించారు. పుష్కరం తర్వాత తమ చెంతకు చేరిన పెద్ద దిక్కును చూసి.. ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైంది. ఉప్పమ్మను గుర్తించి, చేరదీసి తమకు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది.

Intro:JK_AP_TPG_21_03_TOBBACO_BOARD_VISIT_MLA_AV_C3
యాంకర్: ఎన్ ఎల్ ఎస్ పరిధిలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడతానని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్న మట్ల ఎలీజా అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు పొగాకు వేలం ని పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు గత నాలుగేళ్లుగా ఒక ధరకు గిట్టుబాటు ధర రాకుండా రైతులు నష్టాల బాట పడుతున్నారు రైతులు తెలిపారు ప్రతి సంవత్సరం బ్యా రన్ కు లక్ష వరకు నష్టపోతున్నామని రైతులు తెలిపారు అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం పొగాకు డిమాండ్ ఉన్న కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని పొగాకు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఏటా చెస్ రూపంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు పొగాకు బోర్డు అధికారులు సైతం కొనుగోలు కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారని ఇదే విధానం కొనసాగితే పొగాకు పంటకు క్రాఫ్ హాలిడే ప్రకటించక తప్పదని పొగాకు రైతులు డిమాండ్లను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి జగన్ నుంచి ప్రధానమంత్రి తెలిసేలా కృషి చేస్తానని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా రైతులకు హామీ ఇచ్చారు
నోట్: బైట్స్ సెకండ్ ఫైల్ లో వస్తాయి పరిశీలించగలరు


Body:టొబాకో బోర్డు విసిట్ ఎమ్మెల్యే


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.